జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య ప్రాతిపదికనే రాష్ట్రాలకు టీకాలు కేటాయించనున్నట్టు కేంద్రం పేర్కొంది. వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని.. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది. కరోనా కేసులు, వ్యాక్సినేషన్ సమర్థంగా చేపడుతున్న రాష్ట్రాలకు టీకా కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపింది. టీకాల వృథా చేసే రాష్ట్రాలకు కేటాయింపుల్లో కొత్త ఉంటుందని పేర్కొంది. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలలో 75 శాతం కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేస్తుంది.
టీకాలను ప్రాధాన్యతా క్రమంలో వరుసగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడిన పౌరులు, రెండో డోసు వేయించుకోవాల్సినవారు, 18 ఏళ్లు పైబడినవారిగా విభజించింది. ఇక 18 ఏళ్లు పైబడినవారిలో ప్రాధాన్యతా క్రమాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే నిర్ణయించుకోవాలని సూచించింది. దేశంలో ఉత్పత్తి అయ్యే టీకాల్లో 25 శాతం డోసులను ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కొనుగోలు చేసి అందించే వీలు కూడా కల్పించింది. అయితే, ఇందుకు వ్యాక్సిన్ ధరపై సేవాపన్నును గరిష్టంగా రూ.150 మాత్రమే తీసుకోవాలని స్పష్టంచేసింది. ఇక టీకా నమోదు కోసం కొవిన్ యాప్ తోపాటు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచాలని కేంద్రం పేర్కొంది.
862514 162823Im glad I located your write-up. I would never have created sense of this subject on my own. Ive read several other articles on this subject, but I was confused until I read yours. 51043