టీఆర్ఎస్ పార్టీలో ఓవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ సాగుతుండగా.. తాజాగా మరో కలకలం రేగింది. మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ గులాబీ దళంలో గుబులు రేపుతోంది. ఓ పత్రికలో జగదీశ్ రెడ్డిపై వచ్చిన కథనాన్ని జోడిస్తూ రేవంత్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘రస’కందాయంలో హంపి ’ధూమ్ ధామ్’.. కోవర్డ్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం.. యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా..? అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతికిరణ్, మంత్రి జగదీశ్ రెడ్డిలను ఉద్దేశించే ఆయన ఆ ట్వీట్ చేశారని చర్చ సాగుతోంది.
త్వరలో టీఆర్ఎస్ లో మరో సంచలనం జరగబోతోందనే ఊహాగానలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి కర్ణాటకలోని హంపిలో తన కుమారుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వాటికి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు పలువురు పార్టీ ప్రముఖఉలు హాజరయ్యారు. ఆ సందర్భంగా పార్టీ అంశాలపై ఎక్కువగా చర్చ సాగినట్టు ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనంలో ఉంది. కేటీఆర్ ను సీఎం చేయడం వంటి విషయాలను ప్రధానంగా చర్చించినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో దానిని ఉటంకిస్తూ రేవంత్ ఇలాంటి ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
407173 631650All you need to have to know about News data to you. 447847
976180 685443Good website, good and simple on the eyes and great content too. Do you need numerous drafts to make a post? 978773
820475 876374hey was just seeing in the event you minded a comment. i like your website and the theme you picked is super. I will be back. 657971