హుజూరాబాద్ నుంచే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువని.. ఎత్తిన జెండా, బిగించిన పిడికిలితో మరోమారు ఇక్కడ నుంచే ఉద్యమంతో కదం తొక్కుతామని స్పష్టంచేశారు. నాడు సింహగర్జనకు కరీంనగర్ ఎలా తొలిపలుకు పలికిందో.. నేడు హుజూరాబాద్ కూడా ఆత్మగౌరవ పోరాటానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమక్షేత్రంగా మారుతుందని చెప్పారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. కమలాపూర్ మండలంలో అభిమానులు, కార్యకర్తలతో కలసి రోడ్ షో లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ధర్మానికి, అధర్మానికి మధ్య సంగ్రామం జరగనుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెబుతామని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చెప్పారని.. తన విజయానికి భరోసా ఇచ్చారని వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు తొత్తులుగా మారి తనపై విమర్శలు చేస్తున్నారని ఈటల విమర్శించారు. అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అక్రమ సంపాదనతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారని ఈటల ఆరోపించారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ధర్మానిదే విజయమని స్పష్టంచేశారు.
747396 848404I like you weblog (dsol, je suis francais, je parle mal anglais) 993293
522652 215945I genuinely enjoy looking by way of on this internet internet site , it holds superb articles . 49287
331981 977120its wonderful as your other articles : D, regards for posting . 646388