గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అందించాలని, అంతరాయాలు లేకుండా నెట్వర్క్ అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఐటీ, డిజిటల్ టెక్నాలజీపై జరిపిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. గ్రామాల్లో అవసరాన్ని బట్టి ఏ స్థాయి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలన్నా ఇచ్చేందుకు సిద్దమవ్వాలని సీఎం అన్నారు. గ్రామాల్లో నెట్ వర్క్ పాయింట్ ఏర్పాటు చేయడం ద్వారా సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయాలు అందేలా చేయాలని సీఎం అన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వచ్చే అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్ టాప్ లు ఇవ్వాడానికి కూడా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ల్యాప్ టాప్స్ లో సమస్యలు వస్తే ప్రభుత్వమే మరమ్మతులు చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో ల్యాప్ టాప్ లు ఇస్తే వారంలో మరమ్మతు చేసి ఇచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితోపాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
365708 84028As soon as I detected this internet site I went on reddit to share some of the enjoy with them. 574978
671815 871596Hi there, just became aware of your weblog via Google, and identified that its truly informative. Ill be grateful in case you continue this in future. Lots of folks will benefit from your writing. Cheers! 374397