ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ కొత్త వాహనాలను సీఎం వైఎస్ జగన్ నేడు విజయవాడలో ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద సీఎం జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన వాహనాలను మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రారంభించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1 నుంచి డోర్ డెలివరీ కానుంది.
శ్రీకాకుళంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, కడపలో ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్బాషా రేషన్ సరఫరా వాహనాల పంపిణీని ప్రారంభించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. నాణ్యమైన బియ్యం అర్హుల ఇళ్ల వద్దకే అందించనుంది ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వంపై ఏటా 830 కోట్లు అదనంగా వెచ్చించనుంది.
361733 669345really good post, i undoubtedly really like this excellent web site, carry on it 827548
539673 399282I feel this site has got some extremely superb information for everybody : D. 691962