కరోనా సమయంలో రోగులకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ట్రీట్మెంట్ అందిస్తున్న వైధ్య సిబ్బందికి జనాలు అంతా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు. అయితే వారి పరిస్థితి మాటల వరకే పరిమితం అవుతుంది. కరోనా రోగులకు ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి నర్సుల పరిస్థితి దారుణంగా ఉంది. వారు ఆరోగ్యంగా ఉన్నంత కాలం వారితో పని చేయించుకుంటున్న ఆసుపత్రి యాజమాన్యం ఎప్పుడైతే వారికి కరోనా అంటూ నిర్థారణ అవుతుందో వెంటనే వారిని వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తమ ఆసుపత్రుల్లో కరోనా వార్డులు ఉన్నా కూడా ప్రభుత్వం ఆసుపత్రులకు పంపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన నర్సు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో గాంధీలో జాయిన్ అయ్యిందట. ఆమె రెండు వారాల తర్వాత కోలుకుంది. ఆ రెండు వారాలకు జీతం ఇవ్వక పోవడంతో పాటు ఆమెను ఉద్యోగంలో చేర్చుకునేందుకు కూడా వెంటనే ఒప్పుకోలేదట. ఇలా మొత్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం చిరాకు పెడుతున్న నేపథ్యంలో తాజాగా ప్రైవేట్ ఆసుపత్రుల నర్సులు ఆందోళనకు దిగారు. తమ ఆరోగ్యం విషయంలో హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
218042 913132Thanks for all your efforts which you have put in this. quite fascinating information . 657854
11853 512950enjoy your imagination!!!! excellent work!! oh yeah.. cool photography too. 766229