కర్ణాటక కొడగు జిల్లాలో దారుణం జరిగింది. ఒక కాఫీ తోటకు చెందిన వారు 20 ఆవులను హత్య చేశారు. ఆవులు కాఫీ తోటలోకి ప్రవేశించి తోటను పాక్షికంగా నాశనం చేశాయంటూ వారు తీవ్ర ఆగ్రహంతో ఈ పని చేశారు. 20 ఆవులకు అరటి పండ్లలో మందు పెట్టి వాటితో తినిపించి చంపేసినట్లుగా పోలీసులు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా హిందువుల మనో భావాలను దెబ్బ తీసింది. దాంతో వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… కాఫీ తోటలోకి పదే పదే ఆవులు వస్తున్నాయనే కోపంతో తోట మేనేజర్ మరియు ఆ తోటలో పని చేసే కూలీలు ఈ పనికి పాల్పడ్డారు. తోటలోకి వెళ్లిన ప్రతి ఆవును అత్యంత ప్రమాదకరమైన విషం పెట్టడం వల్ల కొన్ని నిమిషాల వ్యవదిలోనే మృతి చెందేవి. వాటిని వెంటనే ఒక గొయ్యిలో పడవేసేవారు. అలా ఇప్పటి వరకు 20 గోవులను వారు హత్య చేసినట్లుగా తెలుస్తోంది.
ఇన్ని రోజులు గోవులు మిస్ అవుతున్న నేపథ్యంలో వాటి యజమానులు ఆవులకు సంబంధించిన ఆనవాళ్లు కాఫీతోట ఎస్టేట్ వద్ద కనిపించడంతో కాస్త లోతుగా ఎంక్వౌరీ చేస్తే అసలు విషయం వెళ్లడయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. మేనేజర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
767191 817742Excellently written post, doubts all bloggers offered the identical content since you, the internet has to be far far better spot. Please stay the most effective! 495545