‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,099FansLike
57,764FollowersFollow

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ మరోసారి మ్యాడ్ నెస్ ని ఆవిష్కరించింది!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. అలాగే ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ‘డీజే టిల్లు’లో సిద్ధు పలికిన “అట్లుంటది మనతోని” వంటి పలు మాటలు.. టిల్లు అభిమానులతో పాటు సామాన్యులలో కూడా రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి.

‘డీజే టిల్లు’ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో, టిల్లు పాత్రతో మరోసారి వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘డీజే టిల్లు’ తరహాలోనే వినోదాత్మకంగా, టిల్లు శైలి సంభాషణలతో ఈ చిత్రం సాగనుంది. ఈ సీక్వెల్ తో మొదటి భాగానికి రెట్టింపు వినోదాన్ని అందిస్తామని చిత్రం బృందం ఎంతో నమ్మకంగా ఉంది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. “టిల్లు” ఫిల్మ్ ఫ్రాంచైజీ నుండి ఈ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ను అందించడానికి సిద్ధంగా ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది.

ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె, పక్కింటి అమ్మాయిలా ఉంటుందనే తన ఆన్-స్క్రీన్ ఇమేజ్‌ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అనుపమ పరమేశ్వరన్ లుక్స్‌తో పాటు ఆమె బాడీ లాంగ్వేజ్ మరియు సిద్ధూతో ఆమె కెమిస్ట్రీ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

మొదటి భాగంలో రాధిక ప్రేమ కారణంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న టిల్లు.. ఇప్పుడు మరోసారి అదే తరహాలో సమస్యల సమూహంలో చిక్కుకున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. అయితే మేకర్స్ కథకి సంబంధించిన విషయాలను ఎక్కువగా వెల్లడించకుండా.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ ను అద్భుతంగా రూపొందించారు.

రామ్ మిరియాల స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలై వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్ తోనే ఆయన.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, మొదటి భాగాన్ని మించి అలరించనున్నామనే నమ్మకాన్ని కలిగించగలిగారు.

‘టిల్లు స్క్వేర్’ చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

సినిమా

“హానెస్ట్ మూవీకి ప్రేక్షకుల మద్దతు”.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై కిరణ్ అబ్బవరం ఆనందం

న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ...

Vijay Devarakonda: మూడు ప్రాజెక్టులూ క్రేజీనే.. విజయ్ దేవరకొండ లైనప్ సూపర్

Vijay Devarakonda: కెరీర్లో వరుస పరాజయాలు ఉన్నా ఆ హీరోకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. దర్శక-రచయితలు ఆయనకు కథలు చెప్పడం మానలేదు. నిర్మాతలు ఆ...

Varun Tej: వరుణ్ తేజ్ కు గాయం.. శస్త్రచికిత్స, ఆరోగ్యస్థితిపై వివరాలు...

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటివల గాయపడిన సంగతి తెలిసిందే. చెల్లెలు నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు వరుణ్. వాలీబాల్...

Prakash Raj: ప్రకాశ్ రాజ్ పై పరువు నష్టం దావా.. క్రిమినల్...

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల దైవం శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మొత్తం హిందూ సమాజం...

రామ్‌కు తమిళ టచ్.. లోకేష్ శిష్యుడితో కొత్త సినిమా?

టాలీవుడ్ హీరో Ram Pothineni కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు Lokesh Kanagaraj వద్ద పనిచేసిన విగ్నేష్‌తో సినిమా చేయడానికి చర్చలు...

రాజకీయం

“పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే మా ప్రభుత్వ ధ్యేయం”: పిడుగు హరిప్రసాద్

పేదలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం తమదేనని, వారికి కడుపునిండా భోజనం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసన మండలిలో ప్రభుత్వ విప్ Pidugu Hariprasad అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లిలో కొత్తగా ఏర్పాటు...

పునర్వికకు పునర్జన్మ.. లోకేష్ అండతో జీవం పొందిన చిన్నారి

అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి పునర్వికకు చివరికి ఆశాకిరణం కనిపించింది. విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అండతో ఈ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్‌లోని Rainbow Children’s Hospital...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై .. నిడదవోలులో సీఎం చంద్రబాబు ర్యాలీ

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నిడదవోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆందోళనను...

రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.!

సినీ నటుడు ప్రకాష్ రాజ్, తరచూ వివాదాల్లోకెక్కుతుంటాడు. వివాదాల్లేకపోతే, ప్రకాష్ రాజ్‌ని ఎవరూ పట్టించుకోరా.? ఎవరూ పట్టించుకోరేమోనన్న భయంతోనే, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లోకెక్కతుంటాడా.? అసలు ప్రకాష్ రాజ్ సమస్య ఏంటి.? ఎందుకు...

మహిళలకు న్యాయం చేయాల్సిన సమయంలో రాజకీయ విభేదాలు… పవన్ కళ్యాణ్ స్పందన

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే కీలక అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు కోల్పోయాయని ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా సమర్థించి ఉంటే వారికి గౌరవం...

ఎక్కువ చదివినవి

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి Sree Harsha...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా ఈ సినిమా మంచి హోల్డ్ చూపించడం...

“ఫ్యామిలీల ఫస్ట్ ఛాయిస్‌గా ‘తిమ్మరాజుపల్లి టీవీ’…”: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా విడుదలైన తొలి రోజే మంచి స్పందన అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోయిన్లు...

“పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే మా ప్రభుత్వ ధ్యేయం”: పిడుగు హరిప్రసాద్

పేదలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం తమదేనని, వారికి కడుపునిండా భోజనం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శాసన మండలిలో ప్రభుత్వ విప్ Pidugu Hariprasad అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని యూ.కొత్తపల్లిలో కొత్తగా ఏర్పాటు...