ప్రముఖ సోషల్ మీడియా వీడియో యాప్ టిక్ టాక్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. చైనాకు చెందిన ఈ వీడియో యాప్ వల్ల అశ్లీల, అసభ్య కంటెంట్ ఎక్కువగా వ్యాప్తి అవుతోందని ఆందోళన వ్యక్తంచేసిన న్యాయస్థానం.. వెంటనే ఈ యాప్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ మేరకు జస్టిస్ ఎన్.కురుబకరన్, జస్టిస్ ఎస్ఎస్ సుందర్ లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఈ యాప్ ఉపయోగించి రూపొందించిన వీడియోలను ప్రసారం చేయొద్దని మీడియాకు స్పష్టంచేసింది. టిక్ టాక్ అనే సోషల్ మీడియా యాప్ ఇటీవల కాలంలో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. చైనాకు చెందిన ఈ యాప్ ఉపయోగించి స్పెషల్ ఎఫెక్ట్స్ తో చిన్న చిన్న వీడియోలు చేసే అవకాశం ఉంది. దీంతో యువత దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. తమ అభిప్రాయాలు, జోకులు, ఇతర కంటెంట్ ను దీని ఆ యాప్ సాయంతో రూపొందించి పోస్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం భారత్ లో నెలకు దాదాపు 5.4 కోట్ల మంది వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నట్టు అంచనా. అయితే, వినోదం కోసం ప్రారంభించిన ఈ యాప్ వల్ల పలు నష్టాలు కూడా కలుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అశ్లీల కంటెంట్ బాగా వ్యాప్తి చెందుతోంది. దీంతో పిల్లలు కూడా వాటికి ప్రభావితం అవుతుండటంతో మధురైకి చెందిన ముత్తుకుమార్ అనే న్యాయవాది ఈ యాప్ ను నిషేధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఆయా వీడియోల్లోని అశ్లీల కంటెంట్ కారణంగా పిల్లలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నారని, ఫలితంగా మన సంస్కృతికి కూడా విఘాతం కలుగుతోందని, అంతేకాకుండా పిల్లల్లో హింసా ప్రవృత్తి పెరగడంతోపాటు ఆత్మహత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. వెంటనే ఈ యాప్ ను నిషేధించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్ ప్రస్తావించిన అంశాలతో ఏకీభవించింది.
ఈ యాప్ వల్ల అశ్లీల కంటెంట్ వ్యాప్తిచెందడంపై ఆందోళన వ్యక్తంచేసింది. ఈ యాప్ వల్ల కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకుండా దీనిని పిల్లలపై పరీక్షించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఈ కారణంతోనే ఈ యాప్ ను ఇండోనేషియా, బంగ్లాదేశ్ లలో నిషేధించిన విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. మనదేశంలో కూడా ఈ యాప్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
అలాగే అమెరికాలో వున్నట్టుగా బాలల ఆన్ లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా ఈనెల 16లోగా తెలియజేయాలని సూచించింది. కాగా, మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై టిక్ టాక్ ప్రతినిధి స్పందించారు. తమ కంపెనీ స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.
కోర్టు ఉత్తర్వులు ఇంకా అందలేదని, వాటిని పరిశీలించిన తర్వాత చట్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. యాప్ ద్వారా సురక్షిత, సానుకూల వాతావరణం కొనసాగించడమే తమ ప్రధమ ప్రాధాన్యమని తెలిపారు. బీజింగ్ కేంద్రంగా పనిచేసే బైటేడాన్స్ టెక్నాలజీ కంపెనీ ఈ టిక్ టాక్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ను నిషేధించాలంటూ ఇటీవల తమిళనాడులోని అన్నాడీఎంకేకు చెందిన నేత తమిమన్ అన్సారీ డిమాండ్ చేశారు.
940799 868865Some really fascinating info , well written and loosely user genial . 316074
29662 898271Hmm is anyone else encountering problems with the pictures on this weblog loading? Im trying to figure out if its a dilemma on my end or if its the weblog. Any responses would be greatly appreciated. 604705
436647 286872Really informative post. Your current Internet site style is awesome as properly! 70728