ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత సన్నిహితుడు మురళీమోహన్ అడ్డంగా బుక్కయిపోయారు. రాజమండ్రి ఎంపీగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న తన కోడలు మాగంటి రూప ఎన్నికల ఖర్చుల నిమిత్తం పంపిస్తున్న సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాగుల నిండా నోట్ల కట్టలతో వెళుతున్న ఆయన సంస్థలోని ఇద్దరు ఉద్యోగులను హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం రూ.2 కోట్లను వారిద్దరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.
రూ.కోటి విలువైన ఐదు వందల నోట్లు, మరో కోటి రూపాయల విలువైన రెండు వేల నోట్లు ఉన్నట్టు గుర్తించి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు అసలు విషయం ఈజీగానే చెప్పేశారు. తాము జయభేరి ప్రాపర్టీస్ సంస్థ ఉద్యోగులమని, ఈ సొమ్మును హైదరాబాద్ నుంచి రాజమండ్రి తరలిస్తున్నట్టు వెల్లడించారు.
మురళీమోహన్ కోడలు మాగంటి రూప కు అందజేయడం కోసమే ఈ మొత్తాన్ని తాము ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నామంటూ అసలు విషయం పూస గుచ్చినట్టు చెప్పేశారు. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మురళీమోహన్ జయభేరి సంస్థ అధిపతి అన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. అయితే, ఈసారి తాను ఎంపీగా పోటీ చేయనంటూ ముందుగానే ఆయన తప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన కోడలు మాగంటి రూపకు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేశారు. తన మామగారు రాజమండ్రిలో లేని సమయాల్లో పార్టీ కేడర్ కు అండగా ఉండటం.. వారి బాగోగులు చూసుకోవడం వంటి కారణాలతో ఆమె గెలుపు ఖాయమనే భావనతో బాబు ఆమెకే టికెట్ ఇచ్చారు. ఇక ఎన్నికలకు సమయం ఎంతో లేకపోవడంతో ప్రస్తుతం రూప తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే, ఎన్నికల్లో పంపిణీకి అవసరమైన సొమ్మును మురళీమోహన్ హైదరాబాద్ నుంచి పంపించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. కారులో తరలిస్తే తనిఖీల్లో దొరికిపోయే అవకాశం ఉందని భావించి తన సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులను ఇందుకు ఎంపిక చేశారు. వారిని రైలులో రాజమండ్రికి పంపే ఏర్పాట్లు చేశారు.
ఇందుకు అనుగుణంగానే వారిద్దరూ బుధవారం సాయంత్రం మాదాపూర్ లోని తమ సంస్థ కార్యాలయం నుంచి రూ.2 కోట్ల మొత్తాన్ని రెండు బ్యాగుల్లో సర్దుకుని హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ కు ఆటోలో వెళ్లారు. అక్కడి నుంచి ఎంఎంటీఎస్ లో సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి వెళ్లాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. అలా అయితే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ లో లగేజీ చెకింగ్ చేయించుకునే అవకాశం కూడా ఉండదు.
ఒక్కసారి రైలెక్కితే నేరుగా రాజమండ్రి వెళ్లే వరకు ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లోనే ఇద్దరూ డబ్బుల కట్టలున్న బ్యాగులతో పోలీసులకు దొరికిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురై అసలు విషయాలన్నీ చెప్పేశారు. తమ యజమాని కోడలు మాగంటి రూపకు అందజేయడానికే ఈ మొత్తం తీసుకెళ్తున్నట్టు విచారణలో అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలే ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్న ఈ సమయంలో బాబు సన్నిహితుడు ఇలా దొరికిపోవడంతో కేసీఆర్ చేతికి బ్రహ్మాస్త్రం దొరికినట్టే అంటున్నారు. ఈ వ్యవహారంలో మురళీ మోహన్ బుక్కయినట్టేనని చెబుతున్నారు.
ఈ విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా, మురళీమోహన్ పై కేసు నమోదు చేసినట్టు గురువారం సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మురళీమోహన్తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. వీరిలో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
526149 638178I havent checked in here for some time because I thought it was finding boring, but the last couple of posts are genuinely excellent quality so I guess Ill add you back to my daily bloglist. You deserve it my friend. insurance guides 916644
640518 83124This sounds in a way inflammatory pending mecant wait for thisthank you! 762073
806237 331088I appreciate you taking the time to talk about them with men and women. 556638
888113 939435Really usefull blog. i will follow this blog. maintain up the excellent work. 297349