ఇటీవల కాంగ్రెస్కు రాజీనామ చేసిన రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ గురువారం బిజెపిలో చేరారు. కేంద్రమంత్రి జెపి సడ్డా సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు పాతిక సంవత్సరాల తరువాత తాను పార్టీని వీడినట్టు ఆయన తెలిపారు.
తాను రాజీనామ చేసి పదిహేను సంవత్సరాలు ఆలోచించి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. సైద్దాంతిక విధానం, ప్రాంతీయ భావజాలం లేని కాంగ్రెస్లో తాను ఇముడలేకపోయానని ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, దేశ సమగ్రత కోసం తాను ఈ పార్టీలో చేరుతున్నట్టు ఆనందభాస్కర్ చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. దేశాభివృద్ధి బిజెపితోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తొలుత కాంగ్రెస్ కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగి అదే పార్టీ నుంచి రాజ్యసభసభ్యుడిగా ఆనంద భాస్కర్ ఎదిగారు. ముందు ఈనాడు, ఉదయం, వార్త దిన పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేసారు.
ఇందిరాగాంధీ జీవిత చరిత్రతో పాటు జర్నలిజంపై కూడా మంచి పుస్తకాలు రాసారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి డికె అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు ఇటీవల బిజెపిలో చేరారు. కొందరు కాంగ్రెస్ ఎంఎల్ఎలు కూడా అధికార టిఆర్ఎస్ లో చేరారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది.
679633 115401 Spot on with this write-up, I truly think this web site needs much a lot more consideration. Ill probably be again to read considerably much more, thanks for that info. 454523
948712 927224I used to be far more than pleased to seek out this internet-site.. I dont even know how I ended up here, but I thought this post was excellent. A good deal a lot more A rise in Agreeable. 552254
379997 884922This internet site is really a walk-through it actually could be the details you wanted concerning this and didnt know who to inquire about. Glimpse here, and you will definitely discover it. 33674