తమిళనాడు రాష్ట్రం హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ మొత్తంలో నగదు మరియు డబ్బును పట్ట పగలు దోచుకు వెళ్లిన దొంగలను పోలీసులు అత్యంత చాక చక్యంగా పట్టుకున్నారు. దొంగల ముఠా డబ్బు మరియు నగదును టూవీలర్ పై తీసుకు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజ్ లభించింది. ఆ తర్వాత దొంగలు ఆ నగదును ఖచ్చితంగా రాష్ట్రాలు దాటించడం ఖాయం అనుకున్నారు. అనుకున్నట్లుగా వారు పక్క రాష్ట్రాల మీదుగా ఉత్తర భారతంకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తమిళనాడు పోలీసులు వారిని పట్టుకున్నారు.
పక్క రాష్ట్రాలతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలకు తమిళనాడు పోలీసులు సమాచారం అందించారు. దాదాపు 25 కేజీల బంగారంతో పారిపోతున్న వారిని తెలంగాణ పోలీసులు శంషాబాద్ వద్ద ఉన్న టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు. కృష్ణగిరి జిల్లా ఎస్పీ గంగాధర్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఈ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టుకున్నారు. టోల్ గేట్ వద్ద కంటైనర్ ను పట్టుకుని దొంగతనంకు పాల్పడ్డ వారిని కూడా పట్టుకున్నారు. దీంతో అతి కొన్ని గంటల్లోనే దొంగతనం కేసు ఛేదించారు. రెండు రాష్ట్రాల పోలీసులు ఈ కేసును అత్యంత చాకచక్యం వ్యవహరించి దొంగలను పట్టుకున్నారు.