భారత్ పలు ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను అందిస్తుంది. కొన్ని దేశాలకు ఉచితంగానే వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పలు దేశాలు కరోనాతో అల్లాడుతున్న ఈ సమయంలో భారత్ కు చెందిన రెండు సంస్థలు వ్యాక్సిన్ ను తీసుకు వచ్చాయి. దాంతో పలు దేశాలు వ్యాక్సిన్ కోసం మన ముందు చేతులు చాచాయి. దాంతో దక్షిణ ఆసియా దేశాలు అన్నింటికి కూడా భారత్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు దేశాలకు వ్యాక్సిన్ ను పంపించింది.
ఈ నేపథ్యంలో అమెరికా సౌత్ సెంట్రల్ ఏసియా విభాగం తమ ట్విట్టర్ ఖాతాలో భారత్ పై ప్రశంసలు కురిపించింది. నిజమైన స్నేహంకు భారత్ అర్థం చెప్పింది. ఈ సమయంలో తోటి దేశాలకు కావాల్సిన సాయంను అందించడం నిజంగా అభినందనీయం. ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా ఇండియా గుర్తింపు దక్కించుకుంది. ప్రపంచాన్ని ఆరోగ్యం దిశగా నడపడంలో భారత్ ముందు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ వారు పేర్కొన్నారు.