ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఉగాది వేడుకల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అంటూ టీడీపీ ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పై విమర్శలు చేశారు. అవి చేస్తాం.. ఇవి చేస్తాం అంటూ కొందరు ఎలాంటి అవగాహన లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని దుయ్యబట్టారు. అసలు ఆదాయం ఎక్కడి నుంచి ఎంత మేర ఎలా వస్తుందనే కనీస అవగాహన కూడా లేకుండా ఇష్టానుసారం హామీలిచ్చారని విమర్శించారు. తాము మాత్రం అలా కాకుండా పేదరికం లేని సమాజం నెలకొల్పే దిశగా మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. గతంలో తాము చెప్పినదాని కంటే ఎక్కువే చేశామన్నారు.
టీడీపీ మేనిఫెస్టో ముఖ్యాంశాలివీ..
- ఐదేళ్ల పాటు అన్నదాతా సుఖీభవ పథకం. వచ్చే ఖరీఫ్ నుంచి కౌలు రైతులకూ వర్తింపు.
- రైతులకు 12గంటల పాటు ఉచిత విద్యుత్.. ఉచిత పంటల బీమా
- రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.
- ఏడాదిలో పోలవరం పూర్తి.. 40లక్షల ఎకరాలకు సాగునీరు
- డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కొనసాగింపు.. ఉచితంగా స్మార్ట్ ఫోన్లు
- ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు
- చంద్రన్నబీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
- పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు
- అందరికీ ఉచితంగా ఇళ్లు
- వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
- చంద్రన్న బీమా రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు
- చంద్రన్న భరోసా పింఛన్లు రూ.2వేల నుంచి 3వేలకు పెంపు.
- ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ. వివిధ శాఖల్లోని బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
- నిరుద్యోగ భృతి రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంపు.
- ఇంటర్ విద్యార్థులకు ల్యాప్టాప్లు.. ఇంటర్ పాసైతే నిరుద్యోగ భృతి
- విదేశీ విద్యకు ఉపకార వేతనాలు రూ.25లక్షలకు పెంపు
- పెద్ద పంచాయతీలు, మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు
- పేద కుటుంబాలకు పండుగల కోసం రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు
- చట్ట సభల్లో మహిళలలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి
- ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు
- రూ.100 కోట్లతో అంబేడ్కర్ స్మృతి వనం
- రెండేళ్లలో జగ్జీవన్రామ్ స్మృతివనం
- మరో ఏడు జిల్లాల్లో అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్
- వెనుకబడిన తరగతులకు మరో 200 గురుకులాల ఏర్పాటు
- చేనేత కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా
- ప్రతి చేనేత కుటుంబం ఖాతాలో ఏటా రూ.4వేల జీవన భృతి
- కాపుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు
- కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్ల అమలు
- వచ్చే ఐదేళ్లలో కాపుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు
- ప్రైవేటు దేవాలయాల అర్చకులకు చంద్రన్నబీమా
- అగ్రవర్ణ పేదలకు విద్య, వైద్యం, గృహ నిర్మాణ పథకాలు అమలు
- ప్రతిజిల్లాలో క్రైస్తవ భవనం నిర్మాణం
- మానసిక వికలాంగులకు నెలకు రూ.3వేలు పింఛను
- దివ్యాంగులకు 3 చక్రాల మోటరైజ్డ్ సైకిళ్ల పంపిణీ
- జలధార పథకం ద్వారా అన్ని గ్రామాలకు రక్షిత నీటి సరఫరా
- అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యం.
43881 979203The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as significantly as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is actually a handful of whining about something you can fix inside the event you werent too busy searching for attention. 475996