Switch to English

ఏపీ ఎలక్షన్స్: 10 వేల పైన మెజార్టీ 92 స్థానాల్లో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,961FansLike
57,764FollowersFollow

ఒకప్పుడు ఎన్నికలకు సంబంధించి ముందస్తు సర్వేలు నిర్వహించాలంటే, అదో పెద్ద తతంగం. ఇప్పుడు అంత సీన్ అవసరం లేదు. శాంపిల్స్ తీసుకోవడం చాలా తేలిక. ఎన్నికల ముందర అయినా, ఎన్నికల పోలింగ్ రోజున అయినా.. సర్వేలు చేయడం, చిటికె వేసినంత సులువైపోయింది.

అందుకే, కుప్పలు తెప్పలుగా సర్వేలు వెలుగు చూస్తున్నాయి. ఫలానా పార్టీ మీద మీ అభిప్రాయమేంటి.? అని ఎవరైనా ఓ సామాన్యుడిని అడిగితే, అతనూ ముదిరిపోయాడు.. ఒక్కో సర్వే సందర్భంగా ఒక్కోలా సమాధానమిస్తున్నాడు. అందుకే, శాంపిల్ సైజ్ పెరిగితేనే, రిజల్ట్ విషయమై ఓ స్పష్టతకు రావడానికి వీలుంటుంది.

అలా అన్ని జాగ్రత్తలూ తీసుకుని కూడా కొన్ని సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ కోణంలో చేసిన ఓ ప్రైవేటు సర్వే ప్రకారం, ఆంధ్ర ప్రదెశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) ఘనవిజయం సాధించబోతోందని తేలింది. రాయలసీమకు చెందిన ఓ బృందం ఈ సర్వే నిర్వహించింది.

వృత్తి రీత్యా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా బెంగళూరు, చెన్నయ్, హైద్రాబాద్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న కొందరు స్నేహితులు ఓ బృందంగా ఏర్పడి, పోలింగ్‌కి జస్ట్ రెండు మూడు రోజుల ముందర నిర్వహించిన సర్వే ఇది. పోలింగ్ రోజున కూడా శాంపిల్స్ తీసుకున్నారట.. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తారట.

ఈ సర్వే ద్వారా వెలుగు చూసిన విషయమేంటంటే, కూటమి అభ్యర్థుల్లో దాదాపు 92 మందికి పది వేల కంటే ఎక్కువ మెజార్టీ రాబోతోందిట. కొంతమందికి ఐదు వేల కంటే ఎక్కువ, పది వేల ఓట్ల కంటే తక్కువ ఓట్ల మెజార్టీ లభిస్తుందని సర్వేలో తేలిందని చెబుతున్నారు.

వైసీపీ చెబుతూ వస్తున్న సైలెంట్ ఓటింగ్ అనే మాట నిజమేననీ, ఆ సైలెంట్ ఓటింగ్ వైసీపీకి వ్యతిరేకంగా పడిందనీ, సాధారణంగా సైలెంట్ ఓటింగ్ అనేది అధికార పార్టీకి వ్యతిరేకంగానే పడుతుందనీ, అదే సర్వేలో తేలిందనీ చెబుతున్నారు.

వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్యపై భిన్న వాదనలున్నాయి. ‘ఎడ్జ్’లో వైసీపీకి అన్నీ కలిసొస్తే, 50 సీట్లు రావొచ్చనీ, ఆ ఎడ్జ్ జారితే మాత్రం 25 సీట్ల లోపుకే వైసీపీ పరిమితమవుతుందనీ అంటున్నారు.

అదేంటీ, 175 సీట్లకు గాను మొత్తంగా 175 సీట్లూ వైసీపీనే కొల్లగొడుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు కదా.? అంటే, ఆ విషయాన్ని వైసీపీ శ్రేణులే నమ్మడంలేదు. 95 నుంచి 100 సీట్లతో వైసీపీ ఇంకోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే మాటకి వచ్చేశారు ప్రస్తుతం వైసీపీ మద్దతుదారులు.

అభ్యర్థుల్ని మార్చడం కొంపముంచిందనీ, అదే సమయంలో కొందరు సీనియర్లను కొనసాగించడం దెబ్బేసిందనీ.. వైసీపీ శ్రేణులే ఆయా నియోజకవర్గాల్లో అభిప్రాయపడుతుండడం గమనార్హం.

సినిమా

‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్ లో ఓ హిస్టరీ: డైరెక్టర్ అనిల్...

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం తన జీవితంలో ఓ హిస్టరీ లాంటిదని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల...

ఐటీ దాడులతో ఆ ‘సినిమాల’ లెక్కలు తేలతాయా.?

ఓ సినిమా ఎంత వసూలు చేసింది.? ఎంత పెద్ద హిట్టయ్యింది.? ఈ విషయాల్ని వెల్లడించాల్సింది నిర్మాత మాత్రమే. బాక్సాఫీస్ లెక్కలంటూ సినీ మీడియాలో రాతలు కుప్పలు...

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

రాజకీయం

జనసేనపై ‘విలీన విషం’ చిమ్ముతున్న ఆర్కే.! అసలేంటి కథ.?

జనసేన పార్టీకి ‘గ్లాస్ సింబల్’ ఫిక్సయ్యింది.! కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మేరకు జనసేన పార్టీకి సమాచారం అందించింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా, కేంద్ర ఎన్నికల...

డిప్యూటీ సీఎం పదవి ఎందుకంత స్పెషల్.!

ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో...

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

ఎక్కువ చదివినవి

‘గేమ్ ఛేంజర్‌’పై నెగెటివిటీ: వేలంపాట కూడానా.?

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎబౌ యావరేజ్, హిట్, సూపర్ హిట్.. అనే టాక్...

ఇన్ స్టాగ్రామ్ అదిరిపోయే అప్ డేట్.. యూఎస్ లో టిక్ టాక్ బ్యాన్ కావడం వల్లే..!

ఇప్పుడు ప్రపంచ మంతా ఇన్ స్టా రీల్స్ తోనే టైమ్ పాస్ చేస్తోంది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఏదో ఒక రీల్ చూస్తూ రిలాక్స్ అవుతున్నారు. కొందరు టైమ్...

లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్‌కేంటి నష్టం.?

నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ...

జనసేనపై ‘విలీన విషం’ చిమ్ముతున్న ఆర్కే.! అసలేంటి కథ.?

జనసేన పార్టీకి ‘గ్లాస్ సింబల్’ ఫిక్సయ్యింది.! కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మేరకు జనసేన పార్టీకి సమాచారం అందించింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా, కేంద్ర ఎన్నికల...

వైసీపీకి చావు దెబ్బ: కీలక నేతలు గుడ్ బై.! కార్యకర్తలు లబోదిబో.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళారు.. వైసీపీకి ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన రవిచంద్రారెడ్డి (స్కైమాక్స్ రవి) రాజీనామా చేశారు. అంతేనా, వైసీపీ సొంత పత్రిక సాక్షిలో టీడీపీ ప్రకటన...