దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా అసెంబ్లీ, పార్లమెంటుకు వేర్వేరుసార్లు తెలంగాణ ప్రజలు ఓటేయబోతున్నారు. ఇది ఓటర్లకే కాదు.. నాయకులకు కూడా విచిత్రమైన పరిస్థితే. మూడునెలల క్రితమే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగగా.. అంతలోనే పార్లమెంటుకు ఎన్నికలు రావడంతో ఓటేయడంపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది.
బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఏప్రిల్ 11న జరిగే పోలింగ్కు ఓటుశాతం పెంచాలని తెగ ప్రయత్నిస్తున్నా.. అనుకున్న స్థాయిలో పోలింగ్ జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువమంది జనాలను ప్రచారం ద్వారా చేరుకోవడం.. పోలింగ్ శాతం పెరిగితేనే విజయావకాశాలు పెరుగుతాయని ఈ మూడు పార్టీలూ భావిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలతోపోలిస్తే.. పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం కష్టం. దాదాపుగా ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయడం కష్టమైన పనే. అందుకే కొత్త వ్యూహాలకు రాజకీయ పార్టీలు తెరలేపాయి. కొన్ని వర్గాలను ప్రభావితం చేసే వ్యక్తులను సంతుష్టపరచడం ద్వారా ప్రచారాన్ని మరింత సరళీకృతం చేసుకుంటున్నాయి.
మీడియా, సోషల్ మీడియా ఎంత విస్తృతమైనా.. ఇప్పటికే చాలాచోట్ల ఒపీనియన్ లీడర్స్ పాత్ర కీలకంగా ఉంది. అందుకే ఇలాంటి వారిని తమ బుట్టలో వేసుకునేందుకు అభ్యర్థులు నానా కష్టాలు పడుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేత మొదలు గ్రామస్థాయి నేతలనూ ఇలా ప్రత్యేక ప్యాకేజీలతో ప్రసన్నం చేసుకొనే పనిలో తలమునకలయ్యారు.
పట్టణ ప్రాంతాల్లో వార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలవారీగా ప్రత్యేక సమయాన్ని నిర్దేశించుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు.. ఓటర్లను ప్రభావితం చేసే వారెవరా అని వెతికిపట్టుకోవడాన్ని కూడా అంతే ముఖ్యంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్థాయిని బట్టి వారితో చర్చిస్తున్నారు. ఎంత మంది ఓటర్లను ప్రభావితం చేయగలరనే అంశం ప్రాతిపదికగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భారీగా ఓటర్ల మద్దతు కూడగట్టగల వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. వెయ్యి, ఐదు వేలు, పది వేలు ఇలా ఓటర్ల సంఖ్యకు తగినట్లు బహుమతులు ఇస్తున్నారు.
కొన్నిచోట్ల ఎక్కువ మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటే ఏకంగా అభ్యర్థి సమక్షంలోనే తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. అలా వచ్చిన వారికి దావత్లు ఇస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడం.. వారిని బూత్వరకు తీసుకురావడం ఈ ఒపీనియన్ లీడర్ల బాధ్యతే.
పల్లెటూళ్లోనే కాదు అర్బన్ ఏరియాల్లోనూ ఇలాంటివారికి అసెంబ్లీ ఎన్నికలతోపోలిస్తే మంచి డిమాండ్ పెరిగింది. పట్టణ నియోజకవర్గాలైన ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఇలాంటి దావత్లు జోరుగా సాగుతున్నాయి. మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో ఈ తరహా వ్యక్తులకు భారీ మొత్తంలో బహుమతులు అందిస్తున్నారు.
చేవేళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కాలనీలు, వార్డుల్లో క్రియాశీలవ్యక్తులను భారీ సభలు నిర్వహించి పార్టీల్లో చేర్చుకుంటున్నారు. అదేవిధంగా యువతను ప్రభావితం చేసే యువ నాయకులకు పెద్దపీట వేస్తున్నారు.. వారి డిమాండ్లకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదాహరణకు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో.. ప్రధాన పార్టీ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన భంగపడిన నేత.. వేరేపార్టీ టికెట్ తెచ్చుకుని బరిలోదిగి పోటీ చేసి 20వేలకుపైగా ఓట్లు సాధించారు. ఆయన్ను ఆకర్షించేందుకు దాదాపు అన్ని పార్టీలూ ప్రయత్నించాయి. అయితే ఎక్కువ ప్యాకేజీ ప్రయత్నించిన ఎంపీ అభ్యర్థికి లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా సహకరించేందుకు సదరునేత అంగీకరించారు. ఇలా నియోజకవర్గానికి ఒక్కరు దొరికినా ప్రచారంలో కొంత రిలీఫే కదా అనుకుంటున్నారు అభ్యర్థులు.
599374 895753Paper rolls quite great read you know alot about this topic i see! 907443
42148 494164I genuinely enjoyed your amazing web site. Be sure to maintain it up. May god bless you !!!! 543511