Switch to English

ఏపీ సర్కారుకి ‘కోర్టు’ మొట్టికాయలు.. ఎడా పెడా పడ్డాయ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎదుర్కొన్నంతగా మరే ప్రభుత్వం ఇంతలా న్యాయస్థానాల నుంచి మొట్టికాయల్ని ఎదుర్కొనలేదు. ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులేంటి.? అంటూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా పద్ధతి మార్చుకోలేదు. పైగా, కోర్టుల్ని తిట్టడం వైసీపీ నేతలకు, కార్యకర్తలకు పరిపాటిగా మారిపోయింది.

పదే పదే కోర్టులో మొట్టికాయలు తినేలా వ్యవహరించడం ద్వారా కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించాలనే ప్రయత్నం వైసీపీ చేస్తోందంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేయలేం.

తాజాగా, హైకోర్టు.. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు వారం రోజుల జైలు శిక్ష విధించింది.. తమ ఆదేశాలు పాటించలేదని. అంతలోనే, న్యాయస్థానం.. ప్రభుత్వం తరఫున లిఖిత పూర్వక హామీ రావడంతో (ఏ ఆదేశాలైతే అమలు కాలేదని హైకోర్టు ఆక్షేపించిందో, ఆదేశాల్ని అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ జైలు శిక్ష ఆదేశాల్ని రద్దు చేసింది. ఇదీ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు.

ఇదిలా వుంటే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విషయమై సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయలేదని నిలదీసిన సుప్రీంకోర్టు, పరీక్షల నిర్వహణపై నాన్చివేత ఇంకెన్నాళ్ళని ప్రశ్నించింది. ఒక్క విద్యార్థి ప్రాణం కోల్పోయినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థుల మెడ మీద కత్తి పెట్టినట్లు వ్యవహరించడం ఎంతవరకు సబబు.? అని నిలదీసిన సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసేందుకు రెండు రోజులు సమయమిచ్చింది.

దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి, పరీక్షలపై ప్రకటన చేసేందుకు ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి మినహాయింపు ఎందుకు.? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించడమంటే అది చిన్న విషయం కానే కాదు. కరోనా నేపథ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు పరీక్షల్ని రద్దు చేశాయి. పదో తరగతి పరీక్షల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో విద్యార్థి లోకం తీవ్ర ఆవేదనకు గురవుతోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...