Switch to English

ఏపీ సర్కారుకి ‘కోర్టు’ మొట్టికాయలు.. ఎడా పెడా పడ్డాయ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎదుర్కొన్నంతగా మరే ప్రభుత్వం ఇంతలా న్యాయస్థానాల నుంచి మొట్టికాయల్ని ఎదుర్కొనలేదు. ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులేంటి.? అంటూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా పద్ధతి మార్చుకోలేదు. పైగా, కోర్టుల్ని తిట్టడం వైసీపీ నేతలకు, కార్యకర్తలకు పరిపాటిగా మారిపోయింది.

పదే పదే కోర్టులో మొట్టికాయలు తినేలా వ్యవహరించడం ద్వారా కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించాలనే ప్రయత్నం వైసీపీ చేస్తోందంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేయలేం.

తాజాగా, హైకోర్టు.. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు వారం రోజుల జైలు శిక్ష విధించింది.. తమ ఆదేశాలు పాటించలేదని. అంతలోనే, న్యాయస్థానం.. ప్రభుత్వం తరఫున లిఖిత పూర్వక హామీ రావడంతో (ఏ ఆదేశాలైతే అమలు కాలేదని హైకోర్టు ఆక్షేపించిందో, ఆదేశాల్ని అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ జైలు శిక్ష ఆదేశాల్ని రద్దు చేసింది. ఇదీ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు.

ఇదిలా వుంటే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విషయమై సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయలేదని నిలదీసిన సుప్రీంకోర్టు, పరీక్షల నిర్వహణపై నాన్చివేత ఇంకెన్నాళ్ళని ప్రశ్నించింది. ఒక్క విద్యార్థి ప్రాణం కోల్పోయినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థుల మెడ మీద కత్తి పెట్టినట్లు వ్యవహరించడం ఎంతవరకు సబబు.? అని నిలదీసిన సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసేందుకు రెండు రోజులు సమయమిచ్చింది.

దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి, పరీక్షలపై ప్రకటన చేసేందుకు ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి మినహాయింపు ఎందుకు.? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించడమంటే అది చిన్న విషయం కానే కాదు. కరోనా నేపథ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు పరీక్షల్ని రద్దు చేశాయి. పదో తరగతి పరీక్షల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థుల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో విద్యార్థి లోకం తీవ్ర ఆవేదనకు గురవుతోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...