Switch to English

స్పెషల్ స్టోరీ: ఏపీ నేతల్లో టెన్షన్.. ఇదే కారణం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైకాపా మాత్రం కొంత ఆందోళన చెందుతున్నది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికే వైకాపా ఎంపిటిసి, జెడ్పీటిసి స్థానాలు అనేకం ఏకగ్రీవంగా గెలుచుకుంది. అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుంది.

అయితే, వైకాపా నేతలు మిగతా వాళ్ళను నామినేషన్ దాఖలు చేయనీకుండా అడ్డుకున్నారని, దాడులు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కంప్లైంట్ తో పాటుగా కరోనా ప్రభావం కూడా ఉండటంతో ఎన్నికలను వాయిదా వేశారు. మాచర్ల, తిరుపతి, పుంగనూరు ప్రాంతాల్లో మరలా ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతలను టెన్షన్ పెడుతున్నది.

ఎందుకంటే, ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఎన్నికల్లో ప్రజల కోసం ఖర్చు పెట్టకపోయినా, కనీసం ఎన్నికల సమయంలో పక్కన ఉన్న కార్యకర్తల కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎన్నికల ప్రచారం కోసం డబ్బు ఖర్చు చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒక్కో అభ్యర్థి ఎన్నికల ప్రచారం కోసం భారీగా ఖర్చులు పెడుతుంటారు. గెలుస్తారో లేదో కూడా నమ్మకం ఉండదు.

స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం అయినప్పటికీ హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికల మొదటినుంచి జరిగే అవకాశం ఉందనే సంకేతాలు వస్తుండటంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆలోచనలో పడిపోయారు. అధికార పార్టీ పరిస్థితే ఇలా ఉంటె, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ నుంచి డబ్బులు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే అభ్యర్థులు ఎన్నికల కోసం చాలా ఖర్చు పెట్టారు. ఎన్నికలు వాయిదా పడటంతో వారంతా నిరాశా చెందుతున్నారు.

ఆరు వారాల తరువాత ఎన్నికలు జరిగితే, అప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రాజధాని ప్రభావం ఎక్కువగా ఉన్న గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఎలాగైనా అధిక స్థానాల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తున్నది. ఇది జరగాలి అంటే అభ్యర్థులంతా చురుగ్గా వ్యవహరించాలి. కార్యకర్తలకు చేతులు, జేబులు తడుపుతూనే ఉండాలి. ఇదంతా జరగాలి అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల వద్ద పుష్కలంగా డబ్బు ఉండాలి. అంతిమంగా డబ్బున్న వ్యక్తులే ఎన్నికల్లో విజయం సాధిస్తారు అని చెప్పడానికి ఏపీ ఎన్నికలు ఒక ఉదాహరణగా మారబోతున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....