జమ్మూ కాశ్మీర్ లోని రియాసీ జిల్లాలో చినాబ్ నదిపై చేపట్టిన రైల్వే బ్రిడ్జ్ కీలక దశకు చేరుకుంది. ఆర్చ్ రూపంలో ఈ బ్రిడ్జిను ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణంలో కీలకం అయిన ఆర్చ్ రెండు అంచులను ఇంజనీర్లు తాజాగా అనుసంధానం చేశారు. ఇది పూర్తిగా కేబుల్ ఆధారిత బ్రిడ్జిగా చెప్పుకొచ్చు. ఇంత భారీ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలో లేదు. దీని పొడవు 1315 మీటర్లు కాగా ఎత్తు 359 మీటర్లుగా చెబుతున్నారు. ఎత్తు విషయానికి వస్తే ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తుగా దీనిని నిర్మించారు. ఈఫిట్ టవర్ తో పోల్చితే ఈ రైల్వే బ్రిడ్జ్ ఎత్తు 30 మీటర్లు ఎక్కువ.
కశ్మీర్ లో రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలకు రైలు సౌకర్యం కల్పించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.28 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. రైల్వే శాఖ పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్ట్ పై శ్రద్ద పెట్టి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో కీలకమైన చినాబ్ నది బ్రిడ్జి పూర్తి అవ్వడంతో ప్రాజెక్ట్ మరింత జోష్ తో ముందుకు వెళ్తుంది. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మొత్తం 272 కిలో మీటర్ల మేరకు రైల్వే ట్రాక్ ను వేస్తున్నారు. దీంతో కశ్మీర్ రూపు మారుతుందని పర్యటకులు పెరుగుతురని అంటున్నారు.
102032 616316Aw, this really is an incredibly good post. In thought I would like to put in place writing like this moreover – spending time and actual effort to create a excellent article but exactly what do I say I procrastinate alot by means of no indicates appear to get something accomplished. 902170
849267 253287Dead written articles , Actually enjoyed reading . 905422
457472 25166A lot of thanks for sharing this fine piece. Very fascinating concepts! (as always, btw) 377724