కోల్కత్తాలోని రైల్వే భవనంలో ఈనెల 8వ తారీకున పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఏకంగా 9 మంది చనిపోయిన విషయం తెల్సిందే. రైల్వేకు అది ప్రధాన కేంద్రం అవ్వడం వల్ల బుకింగ్ తో పాటు మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థ ఎక్కడికి అక్కడ నిలిపోయే పరిస్థితి వచ్చింది. కోల్కత్తా లో ఏర్పడిన ఆ ప్రమాదం వల్ల మొత్తం 15 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
టికెట్ బుకింగ్ సేవలు కూడా నిలిపి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో రైళ్ల రాకపోకలకు మరియు బుకింగ్ సేవలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సికింద్రాబాద్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం చూసింది. 8వ తారీకు సాయంత్రం 7.30 గంటల సమయంలో అన్ని రైల్వే స్టేషన్ ల్లో ఆన్ లైన్ సేవలు నిలిచి పోయాయి. దాంతో సికింద్రాబాద్ లోని క్రిస్ అప్పమత్తం అయ్యింది.
మొత్తం వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకుని కొన్ని గంటల్లోనే పూర్తి వ్యవస్థను చక్కదిద్దారు. ఎక్కడ ఏ రైలు ఆగిపోకుండా బుకింగ్ కంటిన్యూగా అయ్యే విధంగా చేశారు. అందుకోసం సిబ్బంది 24 గంటలు పని చేశారు. 13వ తేదీ వరకు కూడా పూర్తి వ్యవస్థ కూడా సికింద్రాబాద్ నుండి కొనసాగింది. కొల్కత్తాలో సిగ్నలింగ్ మరియు ఆన్ లైన్ బుకింగ్ వ్యవస్థ పునరుద్దరించబడింది.
933486 509312Some times its a discomfort inside the ass to read what folks wrote but this site is real user genial ! . 537909
578689 565613amazing post. Neer knew this, thanks for letting me know. 148172
1781 373087As I internet site owner I believe the articles here is actually wonderful , thankyou for your efforts. 532340