‘రాజకీయాల గురించి మాట్లాడే సమయమూ కాదు, సందర్భమూ కాదిది..’ అంటూ ఈ మధ్యనే యంగ్ టైగర్ ఎన్టీయార్ వ్యాఖ్యానించాడు. ‘దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం..’ అంటూ జర్నలిస్టులకు సూచించిన యంగ్ టైగర్.. రాజకీయాలపై ఎప్పుడు స్పందిస్తాడు.? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే, సమయం వచ్చేసింది.. సందర్భమూ వచ్చేసిందంటూ తెలుగు తమ్ముళ్ళే కాదు, వైసీపీ నేతలు కూడా యంగ్ టైగర్ ఎన్టీయార్ గురించి రాజకీయాల్లో ఆసక్తకిరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, టీడీపీని చంద్రబాబు పూర్తిగా ముంచేశారనీ, ఎన్టీయార్ వస్తే తప్ప పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదని అన్నారు. దాంతో, ఒక్కసారిగా యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులూ తమ అభిమాన హీరో రాజకీయాలపై స్పందిస్తే బావుందని కోరుకుంటున్నారు.
నిజానికి, చంద్రబాబు చాణక్యం ముందు యంగ్ టైగర్ ఆటలు చెల్లవనే గట్టి నమ్మకంతో వున్నారు ఇన్నాళ్ళూ అతని అభిమానులు. అందులో నిజం లేకపోలేదు కూడా. గతంలో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరఫున ఎన్టీయార్ సోదరి (హరికృష్ణ కుమార్తె)ను చంద్రబాబు బరిలోకి దింపినప్పుడు కళ్యాణ్ రామ్ గానీ, ఎన్టీయార్ గానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఆ ఉప ఎన్నికలో ఆమె ఓడిపోయారు. అప్పట్లో ‘మీరు మాత్రం ప్రచారానికి వెళ్ళొద్దు’ అని అభిమానులు కుండబద్దలుగొట్టేశారు.. హెచ్చరించారు కూడా.
ప్రస్తుతం యంగ్ టైగర్, సినిమా కెరీర్ పరంగా చాలా బిజీగా, చాలా హ్యాపీగా వున్నాడు. అంరదితోనూ సన్నిహిత సంబంధాలున్నాయతనికి సినీ రంగంలో. అదే రాజకీయాల్లోకి వస్తే, ఆ ‘మంచి’ అంతా నాశనం అయిపోతుంది. అదే అభిమానుల ఆవేదన. కానీ, టీడీపీ ఇప్పుడు దిక్కూ మొక్కూ లేకుండా పడివుంది. స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన పార్టీ అది. తాత పెట్టిన పార్టీ, తెలుగు ప్రజలకు దూరమవుతోంటే, యంగ్ టైగర్ చూస్తూ ఊరుకోగలడా.? గతంలో ఓ సారి టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యంగ్ టైగర్, అవసాన దశలో వున్న టీడీపీని భుజాన వేసుకుని తిరిగే పరిస్థితి వుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
851555 810600replica watches are wonderful reproduction of original authentic swiss luxury time pieces. 238016
262516 492563I like this website so significantly, saved to favorites . 559495