టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు భారీ షాక్ తగిలింది. బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్ లో తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైంది. వరల్డ్ నెం. తై జూ యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది. మొదటి సెట్ లో తొలి సగంలో జోరు చూపిన సింధు.. ఆతర్వాత తై జు ముందు నిలువలేకపోయింది.
ఈక్రమంలో మొదటి సెట్ ను 21-18తో తై జూ గెలిచింది. ఓ దశలో 16-16, 17-17 పాయింట్లతో పోటీ రసవత్తరమైంది. అయితే తైజు వరుస పాయింట్లు సాధించి 21-18తో తొలి సెట్ కైవసం చేసుకుంది. రెండో సెట్లో సింధుపై తైజు పూర్తి అధిక్యమే చూపింది. స్మాష్ షాట్లతో దూకుడు ప్రదర్శించింది. దీంతో 21-12 తేడాతో రెండో సెట్లో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇద్దరి మధ్యా పోరు ఒక దశలో నువ్వా నేనా అన్నట్టే సాగింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడారు. కానీ.. కొన్ని తప్పిదాలతో సింధు ఓడిపోయింది.
భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సింధు ఫైనల్ కు చేరకుండానే ఓటమి చెందడం అభిమానులను ఎంతో నిరాశపరిచింది. 2016 రియో ఒలింపిక్స్ లో ఫైనల్స్ కు చేరుకున్న సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఒలింపిక్స్ లో ఓటమితో కాంస్య పతకం కోసం సింధు పోటీ పడనుంది.
818976 339640Hello! I just now would decide on to supply a enormous thumbs up with the great details you can have here within this post. I will probably be coming back to your weblog web site for additional soon. 807943