Switch to English

కోవిడ్ 19: తప్పంతా ప్రజలదేనా.? ప్రభుత్వాలది తప్పు కాదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్.. కోవిడ్ 19.. ఇది ప్రపంచానికి పెను ముప్పుగా మారింది. ఇదిగో వ్యాక్సిన్ అన్నారు.. అదిగో కేసులు పెరుగుతున్నాయంటున్నారు. ఏది నిజం.? అసలేం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో.. భారతదేశంలో.. ప్రపంచంలోని చాలా దేశాల్లో.? సరే, ప్రపంచం సంగతి పక్కన పెడదాం.. మన దేశం, అందునా మన తెలుగు రాష్ట్రాల విషయానికొద్దాం. ఆగస్ట్ 16 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్ళు తెరచుకోనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నిన్ననే సినిమా థియేటర్లూ తెరచుకున్నాయి. పార్కులు, పర్యాటక ప్రాంతాలైతే గత కొద్ది రోజులుగా కిటకిటలాడిపోతున్నాయి. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించడంతో, అక్కడికి వెళ్ళి వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. పర్యాటకులకు. పబ్బులు, క్లబ్బులు ఓ రేంజ్‌లో తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నాయి. రెస్టారెంట్లు ఫుల్ అయిపోతున్నాయి. ప్రజా రవాణా కూడా కిక్కిరిసిపోతోంది. దేవాలయాలకీ జనం పోటెత్తుతున్నారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడాలంటే 300 రూపాయల టిక్కెట్ కొనుక్కోవాల్సిందే. ఉచిత దర్శనం కల్పిస్తే కరోనా ముప్పు పెరుగుతుందనే చెత్త వాదనని టీటీడీ తెరపైకి తెస్తోంది. ఒకదానితో ఒకటి అస్సలు పొంతన లేని ప్రకటనలు ప్రభుత్వాల నుంచి వస్తున్నాయి.

కరోనా బారిన పడి కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, వెంటనే.. జనంలోకి వెళ్ళిపోయారు. బహిరంగ సభలు పెట్టేశారు.. సహపంక్తి భోజనాలు కూడా చేసేశారు. ఇవేవీ కరోనా వ్యాప్తిని పెంచవని మనం అనుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే, అధికార పార్టీ నేతలు చేస్తున్న పొలిటికల్ కార్యక్రమాల హంగామా అంతా ఇంతా కాదు. మాస్కుల్లేకుండా బయటకొస్తే జరీమానా.. అంటున్నాయి ప్రభుత్వాలు. మాస్కులొక్కటీ సరిపోతాయా.? సోషల్ డిస్టెన్సింగ్ సంగతేంటి.? జనం గుమికూడే అవకాశం వున్న వినోద కేంద్రాల విషయమై ఎందుకు ప్రభుత్వాలు ఆంక్షలు విధించలేకపోతున్నాయి.?

‘సెకెండ్ వేవ్ తగ్గకపోవడానికి కారణం ప్రజల తీరు..’ అంటూ ప్రభుత్వాలు, తప్పంతా ప్రజల మీద నింద వేసేసి చేతులు దులిపేసుకోవడం గమనార్హం. అన్నట్టు, వర్క్ ఎట్ హోం అవకాశం ఇప్పటిదాకా కల్పించిన కొన్ని కంపెనీలు, కార్యాలయాలకు రావాల్సిందిగా ఉద్యోగులపై ఒత్తిళ్ళు తెస్తుండడం.. ప్రభుత్వ కార్యాలయాలూ జనంతో కిటకిటలాడుతుండడం.. ఇవన్నీ కరోనా తీవ్రత పెరగడానికి కారణాలే. మూడో వేవ్ కోసం సర్వసన్నద్ధమవుతున్నాం.. అని తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు సన్నద్ధమవుతాయి.. కానీ, చివరికి బలైపోయేది ప్రజలే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...