Switch to English

లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల కేసు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

దివంగత ఎన్టీఆర్ భార్య, వైఎస్సార్ సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆమె తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ కోటి అనే వ్యక్తి గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు. వాటిని పరిశీలించిన పోలీసులు లక్ష్మీపార్వతిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

వినుకొండ సమీపంలోని ఉప్పరపాలేనికి చెందిన బోరిగొర్ల కోటి అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశాడు. తాను నాలుగేళ్లుగా లక్ష్మీపార్వతి వద్ద పనిచేస్తున్నానని, ఆమె బారి నుంచి తనను కాపాడాలని, కొంతకాలంగా తనను లైంగికంగా తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొనడం కలకలం సృష్టించింది. ఆమె పైకి ఒకలా, లోపల మరోలా ఉంటుందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కోరిక తీర్చాలంటూ ఎంతో ఒత్తిడి చేశారని, అశ్లీల వీడియోలు కూడా పంపించేవారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఏడాదిగా ఆమె ప్రవర్తన బాగోలేదని, తాను ఎంతలా చెప్పినా వినిపించుకోకుండా వేధింపులకు పాల్పడ్డారని లక్ష్మీపార్వతిపై ఆరోపణలు చేశాడు. ఏడాదిగా తనకు, ఆమెకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను కూడా ఓ టీవీ ఛానల్ కు అందజేశాడు. తాను ఆమెను తల్లిలా భావించానని, కానీ ఆమె మాత్రం తనను మరోలా చూశారని పేర్కొన్నాడు. ఎన్టీఆర్ ను కూడా ఆమె చాలా సార్లు తిట్టారని వెల్లడించాడు. తాను చెప్పినట్టుగా వింటే వైఎస్సార్ సీపీలో మంచి పోస్టు కూడా ఇప్పిస్తానని ఆఫర్ చేశారని, కానీ తనకు అలాంటివి ఇష్టం లేదని, అందువల్లే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని కోటి పేర్కొన్నాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో రాంగోపాల్ వర్మ ఆమెను చాలా ఉన్నతంగా చూపించారని, కానీ అసలు కథ అది కాదని, వర్మ తన దగ్గరకు వస్తే స్టోరీ మొత్తం చెబుతానని, దమ్ముంటే ఆ సినిమా తీయాలని సవాల్ చేశాడు. ఈ వ్యవహారంలో తనకు ఏదైనా ఆపద వస్తుందనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు. తమ ఇద్దరి మధ్య ఇటీవల జరిగిన ఓ సంభాషణను సైతం అతడు రికార్డు చేశాడు. ఎన్టీఆర్ దుర్మార్గుడు అని, అమ్మాయిల విషయంలో నాదెండ్ల భాస్కరరావు చెప్పిన విషయాలు నిజమే అని చెప్పారని కోటి వెల్లడించాడు.

అయితే, ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందుగా వైఎస్సార్ సీపీ నాయకురాలిపై ఇలాంటి సంచలన ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే లక్ష్మీపార్వతి అలా ప్రవర్తించారా? లేదా ఆమెను ఇరికించే ఉద్దేశంతో ఎవరైనా కుట్ర పన్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోటి ఫిర్యాదు అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు అతడు అందజేసిన వాట్సాప్ చాట్ ఏ నంబర్ నుంచి వచ్చిందనే అంశాన్ని ధ్రువీకరించుకున్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో హోరాహోరీ పోటీ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ దివంగత ముఖ్యమంత్రి భార్య, ప్రతిపక్షానికి చెందిన నాయకురాలిపై ఇలాంటి ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. కోటి ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నాయా లేదా పోలీసుల దర్యాప్తులో తేలనుంది. తనపై వచ్చిన ఈ సంచలన ఆరోపణల విషయంలో లక్ష్మీపార్వతి ఎలా స్పందిస్తారో చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

Manjummel Boys: ఇళయరాజా నోటీసులపై మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాత స్పందన

Manjummel Boys: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) ఇటివల సూపర్ హిట్టయిన మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) నిర్మాతకు లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి...

రాజకీయం

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఎక్కువ చదివినవి

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన నాగచైతన్య

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది....

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam). టాలీవుడ్ (Tollywood) చరిత్రలోనే ఈ సినిమా...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 24 మే 2024

పంచాంగం తేదీ 24- 05-2024, శుక్రవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం,వసంత రుతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ పాడ్యమి సా.6.45 వరకు తదుపరి విదియ నక్షత్రం:...

అంబటి రాంబాబు రీ-పోలింగ్ గోల.!

మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి, ఆయన గెలిచే అవకాశం లేదు కాబట్టి, సత్తెనపల్లిలో వేరే అభ్యర్థిని పెట్టాలని వైసీపీ అధినాయకత్వం తొలుత భావించింది. కానీ, అంబటి రాంబాబు...