దేశ చరిత్రలో వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ఇందులో జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్లకు సంపూర్ణ మెజారిటీ రాదని కెసిఆర్ జోస్యం చెప్పారు. ఖమ్మం ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలకే 250 నుంచి 260 సీట్లు వచ్చే అవకాశం ఉందని , ఇదే విషయాన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయని రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో 16 ఎంపి స్థానాలను గెలుచుకుని టిఆర్ెస్ దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోసిస్తుందని ఆయన స్పష్టం చేసారు.
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, ఇప్పుడు రాహుల్ అందరూ పేరదరిక నిర్మూలన, గరీబీ హటావో వంటి నినాదాలే ఇస్తున్నారని, కానీ ఇంతవరకు పేదల పరిస్థితిలో మార్పురాలేదని ఆయన అన్నారు. ఎప్పటిదాకా గరీబ్లు ఉంటారని, దేశం మీద వీరికి అవగాహన ఎంత ఉందో తెలుస్తుందన్నారు. వీళ్లకు నిజమైన చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్, బిజెపిలు ఒకరినొకరు నిందించుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.
దేశాన్ని పరిపాలించింది 66 ఏళ్లు పాలించింది ఈ రెండు పార్టీలే అన్నారు. దేశంలో దరిద్రానికి, సాగునీటి, మంచినీటి ఎద్దడికి ఈ రెండు పార్టీలే కారణమన్నారు. సగం దేశం కరెంట్ లేకపోవడానికి ఈ రెండు పార్టీలే తీసుకున్న నిర్ణయాలేనని ఆయన ఆరోపించారు.దేశ దశ,, దిశను మార్చాలంటే తెలంగాణ నుంచి మనం వైతాళికులుగా మారాలని కెసిఆర్ సూచించారు. సీతారామ ప్రాజెక్టును ఒకటిన్నర సంవత్సరం లోపు ప్రారంభిస్తామని, ఇందుకోసం 13 వేల కోట్ల రుణం తీసుకున్నామని, అన్ని అనుమతులు వచ్చాయని కెసిఆర్ పేర్కొన్నారు.
దుమ్ముగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ను ప్రారంభిస్తానని, ఇది ప్రారంభమైన తరువాత జిల్లాల్లో రెండు పంటలకు నీరు అందుతుందన్నారు.దేశంలో పవర్ను ఎలా వాడుకోవాలనే కాంగ్రెస్, బిజెపిలకు తెలియదన్నారు. ప్రతి రోజు దీనిపై మాట్లాడుతున్నానని, ఏ నాయకుడు కూడా దీనిపై స్పందించడం లేదన్నారు. దేశంలో 70 వేల టిఎంసీల నీరు ఉన్నా దానిని వినియోగించుకోవడం లేదన్నారు. సాగునీటి, మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. మళ్లీ ఈ పార్టీలే గెలిస్తే ఇదే వ్యవహారం ఉంటుందని, గుణాత్మకమైన మార్పు రాదని కెసిఆర్ పేర్కొన్నారు.
370860 70926This internet site may be a walk-through its the data you wanted in regards to this and didnt know who should. Glimpse here, and you will totally discover it. 457199
273787 838252Interesting post. Ill be sticking around to hear significantly a lot more from you guys. Thanks! 592328