Switch to English

అమూల్ వైపుగా సంగం.. ప్రభుత్వ పరిధిలోకి ఇందుకేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, సంగం డెయిరీ ఛైర్మన్ పదవిలో కొనసాగుతున్న విషయం విదితమే. ఇటీవల ఆయన్ని ఏపీ ఏసీబీ అరెస్ట్ చేసింది. సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనీ, ఆ అక్రమాలకు కారణం ధూళిపాళ్ళ నరేంద్ర అనీ ఏసీబీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ధూళిపాళ్ళ నరేంద్ర ‘రిమాండ్’లో వున్నారు. ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు సంగం డెయిరీ ఓ ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఇప్పుడది వివాదాల్లోకెక్కింది. దాంతో, సంగం డెయిరీ భవిష్యత్తుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సరిగ్గా ఈ సమయంలోనే సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏమయ్యిందోగానీ, ఆ వెంటనే ఆ జీవోని రద్దు చేస్తూ, ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీని తీసుకొస్తూ, బాధ్యతల్ని తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి సంగం డెయిరీ వెళుతుందన్నమాట.

కార్యకలాపాలకు ఎవరైనా అడ్డు తగిలితే సబ్ కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం చెబుతోంది. ఇంతవరకూ బాగానే వుంది. ప్రభుత్వం, అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పాడి పరిశ్రమను దెబ్బ తీస్తోందనీ, పాల ఉత్పత్తిదారుల్ని మోసం చేస్తోందనీ విపక్షాలు విమర్శిస్తోన్న విషయం విదితమే.

అమూల్ ద్వారా పాల ఉత్పత్తిదారులకు లాభం చేకూరుతుందన్నది ప్రభుత్వం వాదన. అదంతా తూచ్.. అన విపక్షాలు అంటున్నాయి. ఏది నిజం.? ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీని తీసుకురావడమంటే, పరోక్షంగా దాన్ని అమూల్ సంస్థకు అప్పగించినట్లేనన్న విమర్శలకు ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారో ఏమో. టీడీపీ నేతల ఆర్థిక మూలాల్ని దెబ్బ తీయడం, అమూల్ లాంటి సంస్థలకు ఆర్థిక పరిపుష్టి కలిగించడంలో ప్రభుత్వ పెద్దల ఉద్దేశ్యమేంటో అర్థం కావడంలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...