Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో ‘మినీ లాక్ డౌన్’: పదో తరగతి పరీక్షలెలా సాధ్యం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

‘‘పరీక్షల నిర్వహణకు ఇంకా సమయం వుంది. ఈలోగా పరిస్థితులు అదుపులోకి రావొచ్చు. విద్యా సంవత్సరం పూర్తయ్యింది.. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల నిర్వహణ..’’ అంటూ పాడిందే పాటరా.. అన్నట్టు ఒకటే పాట పాడుతున్నారు అధికార పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు. ఇంకోపక్క, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా తీవ్రత నేపథ్యంలో ‘మినీ లాక్ డౌన్’ దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపుగా ప్రతిరోజూ 10 వేల పైన కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దరిమిలా, ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.

వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ‘అబ్బే, అంతా బావుంది.. పరిస్థితి అదుపులోనే వుంది..’ అని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. ‘వీకెండ్ మార్కెట్లలో జనం పోగవుతున్న తీరు చూస్తే, ఎవరికన్నా కరోనా పట్ల భయం వుందా.?’ అని ప్రశ్నిస్తూ, పరీక్షల విషయమై ఎందుకంత అత్యుత్సాహం.. అనే ప్రశ్న విపక్షాలవైపుకు విసురుతున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. కానీ, విద్యార్థుల మనోగతం ఇంకోలా వుంది. ఇది ప్రత్యేక పరిస్థితి.

ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పరీక్షల కోసం ప్రిపేర్ అవలేకపోతున్నామన్నది విద్యార్థుల ఆవేదన. 90 శాతం మందికి పైగా విద్యార్థులు పరీక్షల విషయమై అయిష్టత ప్రదర్శిస్తున్నారు. పెళ్ళిళ్ళకు 50 మంది మాత్రమే హాజరవ్వాలి.. అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరవ్వాలంటూ ఆంక్షలు ఓ వైపు విధిస్తూ, పరీక్షలు మాత్రం నిర్వహించి తీరతామని ప్రభుత్వం చెప్పడాన్ని విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.

దేశంలో చాలా రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన దరిమిలా, అదే బాటలో ఏపీ కూడా ముందడుగు వేస్తే, విద్యార్థులకెలా నష్టం జరుగుతుందన్నది విద్యార్థుల ప్రశ్న. పరీక్షలకు ఇంకో నెల సమయం వుంది గనుక, ఇప్పుడే రద్దు నిర్ణయం ఎందుకన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన కావొచ్చు. లేదంటే, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి గనుక, అస్సలేమాత్రం ఆ డిమాండుకి లొంగకుండా, విద్యార్థుల జీవితాల్ని పణంగా పెట్టాలన్న మొండితనం ప్రభుత్వ పెద్దలకు వుండొచ్చు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం అస్సలేమాత్రం సబబు కాదు.. అన్నది రాజకీయ పరిశీలకుల వాదన.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...