దుబాయ్ వెళ్లలేకపోయానన్న ఆక్రోశంతో ఓ ప్రయాణికుడు తోటి బస్సు ప్రయాణికుల కళ్లలో కారం కొట్టిన సంఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు చేసిన దుశ్చర్యకు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం అయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాడు. అయితే.. పాస్ పోర్టు సరిగా లేదని విమానాశ్రయ అధికారులు అతడిని వెనక్కు పంపారు. దీంతో తీవ్ర నిరాశతో స్వగ్రామం వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి రాజోలు వెళ్లే ఆర్టీసీ ఇంద్ర బస్సు ఎక్కాడు.
పాలకొల్లు పట్టణ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా తోటి ప్రయాణికుల కళ్లలో కారం చల్లాడు. దీంతో ప్రయాణికులకు ఒక్కసారిగా ఏం జరుగుతోందో అర్ధం కాలేదు. కారం కళ్లలో పడటంతో వారు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాంబాబును అదుపులోకి తీసుకున్నారు.
324166 72406I definitely did not realize that. Learnt something new nowadays! Thanks for that. 901489