కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్వరలో యాత్ర తెలంగాణలో ప్రవేశించబోతోంది. ఈనేపథ్యంలో యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించేలోపు రాష్ట్రానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారబోతున్నారని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ తీవ్రంగా స్పందిస్తూ..
‘కేటీఆర్ కుటిల రాజకీయాలు మానుకోవాలి. ఇది రాజకీయ జిమ్మిక్కు. అసత్య ప్రచారాలు చేసి లబ్ది పొందాలని చూడటం హుందా రాజకీయం అనిపించుకోదు. తమ ఐక్యతకు భారత్ జోడో యాత్రే నిదర్శనం’ అని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ మారే అవకాశముందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపాయి.
ఇద్దరు కాంగ్రెస్ MPలు పార్టీ మారుతున్నట్టు @KTRTRS చేసిన ప్రకటన ఒక రాజకీయ జిమ్మిక్కు!
అసత్య ప్రచారాలు చేస్తూ లబ్ధిపొందాలని చూడడం హుందా రాజకీయం అనిపించుకోదు. మా ఐక్యతకు @bharatjodo యాత్రే నిదర్శనం.— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) October 9, 2022
884081 522214Cheap Gucci Handbags Is generally blogengine much better than wp for reasons unknown? Need to be which is turning out to be popluar today. 328884
170149 775806As I web site owner I believe the articles here is actually wonderful , thankyou for your efforts. 779971
803102 371686Wow you hit it on the dot we shall submit to Plurk in addition to Squidoo properly done انواع محركات الطائرات | هندسة نت was excellent 178917