Rapaka Varaparasad: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ వేస్తే రూ.పది కోట్లు ఇస్తామని టీడీపీ ఆఫర్ ఇచ్చిందని ఆరోపించిన కొన్ని గంటల్లోనే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘దొంగ ఓట్లు వేయించుకుని సర్పంచ్ గా గెలిచా. చింతలమూరిలో మా ఇంటి పక్కనే పోలింగ్ స్టేషన్ ఉండేది. దీంతో నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి దొంగ ఓట్లు వేసేవారు. వాళ్ళు ఎవరో అక్కడున్న అధికారులకి తెలిసేది కాదు. ఫలితంగా నాకు 700 నుంచి 800 ఓట్ల మెజారిటీ వచ్చేది’ అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పబ్లిసిటీ కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇలా దొంగ ఓట్లు వేయించుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 2019 లో వరప్రసాద్ తొలుత జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు తర్వాత అధికార వైసీపీలోకి ఫిరాయించారు.
798050 47373Take a peek at the following guidelines what follows discover ideal approach to follow such a mainly because you structure your small business this afternoon. earn money 708877