PM Modi: అయోధ్య (Ayodhya) లో జనవరి 22న జరుగనున్న రామ మందిర (Sri Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది ట్రస్టు. అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు మొదలుపెట్టేశారు. ఈక్రమంలో పలువురు శ్రీరాముడిపై వివిధ రకాలుగా తమ భక్తిని చాటుకుంటున్నారు.
వాటిలో శ్రీరాముడిపై భక్తి పాటలు ఉన్నాయి. ఈక్రమంలో ప్రధాని మోదీ (PM Modi) తనకు నచ్చిన పాటలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ గాయకులను ప్రశంసిస్తున్నారు. అలా గీతాల్లో గుజరాత్ కు చెందిన ప్రముఖ జానపద గాయని గీతా రబారీ ఒకరు. ‘శ్రీ రామ్ ఘర్ ఆయే’ పేరుతో రబారీ తన బృందం ఆలపించిన గీతాన్ని ప్రధాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు.
‘శ్రీరాముని రాక కోసం ప్రజల ఆశలు ఫలించాయి.. ఎదురు చూపులు ముగిసాయి..’ అనే అర్ధంతో వచ్చే పాటను ఆమె ఆలపించారు. ‘రబారీ ఆలపించిన గీతం ఎంతో భావోద్వేగంగా ఉంది.. అందరూ శ్రీరాముని రాక కోసం ఎదురుచూస్తున్నా’రని మోదీ ట్వీట్ చేశారు.