ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16మంది మృతి చెందిన ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించ ప్రభుత్వం వేసిన సిట్ తమ దర్యాప్తు పూర్తి చేసింది. దర్యాప్తులో భాగంగా ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడితోపాటు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు ఫర్ఫెక్ట్ కంపెనీ పేరుతో ఉన్న శానిటైజర్ తాగి మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులోని వివరాల ప్రకారం..
నిందితుడు శ్రీనివాసరావు మూడో తరగతి వరకూ చదువుకున్నాడు. ఓ కిరాణా షాపులో పని చేసిన నిందితుడు తర్వాత సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్ లోని జీడిమెట్ల కేంద్రంగా పర్ఫెక్ట్ కిరాణా స్టోర్స్ పేరుతో ఓ షాపు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో మాస్కులు, శానిటైజర్ల అమ్మకం లాభదాయకం కావడంతో సొంతంగా శానిటైజర్ తయారు చేయాలని ప్లాన్ చేశాడు. దీంతో యూట్యూబ్ లో వీడియోలు చూసి సానిటైజర్ తయారు చేసాడు. వీటికి ‘పర్ఫెక్ట్’ అని పేరు కూడా పెట్టాడు. అయితే.. శానిటైజర్ తయారీకి ప్రమాదకరమైన మిథైల్ క్లోరైడ్ ఉపయోగించాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులూ తీసుకోలేదు.
ఈ శానిటైజర్ ను కురిచేడు ప్రాంతంలో మాత్రమే అమ్మడం కొంత ఊరటనిచ్చే విషయం. శానిటైజర్ తయారీకి, డిస్ట్రిబ్యూషన్ కు ఇద్దరు మార్వాడీలు, మరో డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాసరావుకు సాయం చేశారు. డిస్ట్రిబ్యూటర్ మినహా మిగిలిన వారందరినీ కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా కురిచేడు పోలీసులు అదుపులో ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
995211 917117Merely wanna state that this is quite valuable , Thanks for taking your time to write this. 251296
601895 890699I see something really unique in this internet website . 685142
961117 893335 Spot on with this write-up, I truly think this internet site needs considerably a lot more consideration. Ill probably be once more to read much much more, thanks for that info. 478934
747889 592926Sewing Machines […]any time to read or go to the content or possibly internet internet sites we definitely have associated with[…] 937860