తెలంగాణ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలను, విద్యా సంస్థలను ఇప్పటికే తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయా యూనివర్శిటీల పరిధిలో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను సైతం రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని ఆయన తెలిపారు. ఈమేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటివరకూ జరిగిన పరీక్షలు మినహా.. జరగబోయే పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా అకడమిక్ జూనియర్ కాలేజీలు మూసేయాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సయ్యద్ ఓమర్ జలీల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆన్ లైన్ తరగతులు కొనసాగుతాయని తెలిపారు. ఇంటర్మీడియట్ కోర్సును అందించే అన్ని కళాశాలలు ఈ సూచనల్ని పాటించాలని ఆదేశించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
447930 968706There is noticeably big dollars to understand about this. I suppose you produced particular good points in attributes also. 839799