Switch to English

రివర్స్ అయినా ‘చిక్కిం’చుకున్నారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు అన్న చందంగా.. అధికారులు, కాంట్రాక్టర్లు ఏకం కావాలి కానీ, పనులు ఎలాగైనా చేజిక్కించుకోవచ్చు. మామూలు టెండర్లు అయినా.. రివర్స్ విధానమైనా ఎంచక్కా అన్నీ చేజిక్కించుకోవచ్చు. ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత సర్కారు పిలిచిన టెండర్లను సమీక్షిస్తూ.. రివర్స్ టెండర్లను పిలుస్తున్న సంగతి తెలిసిందే.

తొలుత పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులకే దీనిని పరిమితం చేసినా.. తర్వాత అన్ని పనులకూ ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే చిక్కీ (పల్లీలతో తయారుచేసే పట్టీ) టెండర్లలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రివర్స్ విధానంలో ఈ టెండర్లను పిలిచినప్పటికీ రూ.14 కోట్ల అదనపు భారం పడింది.

అక్షయపాత్రతో పాటు మరో సంస్థ తక్కువ ధరకే చిక్కీలను సరఫరా చేస్తామని పేర్కొన్నప్పటికీ పట్టించుకోకుండా అధిక ధర కోట్ చేసిన సంస్థకే వాటిని కట్టబెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు వారంలో మూడు రోజులు చిక్కీలు ఇవ్వాలి. తొలుత ఇందుకోసం జూలైలో టెండర్లు పిలిచారు. కానీ అంతగా స్పందన రాకపోవడంతో మళ్లీ ఆగస్టులో పిలిచారు. కిలో చిక్కీ సరఫరాకు రూ.135 ధర ఖరారు చేశారు.

అయితే, దీనికంటే 10 శాతం ఎక్సెస్ కు కోట్ చేసిన సంస్థకు టెండర్ ఖరారు చేశారు. వాస్తవానికి అక్షయపాత్రతోపాటు ఇతర మధ్యాహ్న భోజన సంస్థలకు రూ.135 మాత్రమే చెల్లిస్తున్నారు. విశాఖ, విజయనగరం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో తాము రూ.120కే వాటిని సరఫరా చేస్తామని ఓ సంస్థ లేఖ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి చిక్కీల సరఫరా కోసం టెండర్లు పిలిచారు.

అన్ని చోట్లా రూ.142.50 నుంచి రూ.149.20 మధ్య ధరలు ఖరారు చేశారు. తాము నిబంధనల మేరకే టెండర్లు ఖరారు చేశామని అధికారులు చెబుతున్నా.. తక్కువ ధరకే సరఫరా చేస్తామని ముందుకొచ్చిన సంస్థలను ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. టెండర్ నిబంధనల్లో చేసిన మార్పుల వల్లే ఆయా సంస్థలు అర్హత కోల్పోయాయని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏదో మతలబు ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...