Switch to English

రివర్స్ అయినా ‘చిక్కిం’చుకున్నారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,965FansLike
57,764FollowersFollow

శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు అన్న చందంగా.. అధికారులు, కాంట్రాక్టర్లు ఏకం కావాలి కానీ, పనులు ఎలాగైనా చేజిక్కించుకోవచ్చు. మామూలు టెండర్లు అయినా.. రివర్స్ విధానమైనా ఎంచక్కా అన్నీ చేజిక్కించుకోవచ్చు. ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత సర్కారు పిలిచిన టెండర్లను సమీక్షిస్తూ.. రివర్స్ టెండర్లను పిలుస్తున్న సంగతి తెలిసిందే.

తొలుత పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులకే దీనిని పరిమితం చేసినా.. తర్వాత అన్ని పనులకూ ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే చిక్కీ (పల్లీలతో తయారుచేసే పట్టీ) టెండర్లలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రివర్స్ విధానంలో ఈ టెండర్లను పిలిచినప్పటికీ రూ.14 కోట్ల అదనపు భారం పడింది.

అక్షయపాత్రతో పాటు మరో సంస్థ తక్కువ ధరకే చిక్కీలను సరఫరా చేస్తామని పేర్కొన్నప్పటికీ పట్టించుకోకుండా అధిక ధర కోట్ చేసిన సంస్థకే వాటిని కట్టబెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు వారంలో మూడు రోజులు చిక్కీలు ఇవ్వాలి. తొలుత ఇందుకోసం జూలైలో టెండర్లు పిలిచారు. కానీ అంతగా స్పందన రాకపోవడంతో మళ్లీ ఆగస్టులో పిలిచారు. కిలో చిక్కీ సరఫరాకు రూ.135 ధర ఖరారు చేశారు.

అయితే, దీనికంటే 10 శాతం ఎక్సెస్ కు కోట్ చేసిన సంస్థకు టెండర్ ఖరారు చేశారు. వాస్తవానికి అక్షయపాత్రతోపాటు ఇతర మధ్యాహ్న భోజన సంస్థలకు రూ.135 మాత్రమే చెల్లిస్తున్నారు. విశాఖ, విజయనగరం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో తాము రూ.120కే వాటిని సరఫరా చేస్తామని ఓ సంస్థ లేఖ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి చిక్కీల సరఫరా కోసం టెండర్లు పిలిచారు.

అన్ని చోట్లా రూ.142.50 నుంచి రూ.149.20 మధ్య ధరలు ఖరారు చేశారు. తాము నిబంధనల మేరకే టెండర్లు ఖరారు చేశామని అధికారులు చెబుతున్నా.. తక్కువ ధరకే సరఫరా చేస్తామని ముందుకొచ్చిన సంస్థలను ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. టెండర్ నిబంధనల్లో చేసిన మార్పుల వల్లే ఆయా సంస్థలు అర్హత కోల్పోయాయని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏదో మతలబు ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

8 COMMENTS

సినిమా

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి.. లక్ష్మీ మిట్టల్ ను...

దావోస్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అంశాలను వివరిస్తూ పెట్టుబడిదారులను...

‘గేమ్ ఛేంజర్’ సినిమాని విద్యార్థులకు చూపిస్తున్నారెందుకంటే.!

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ...

రాజకీయం

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్‌కేంటి నష్టం.?

నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ...

వైసీపీకి చావు దెబ్బ: కీలక నేతలు గుడ్ బై.! కార్యకర్తలు లబోదిబో.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళారు.. వైసీపీకి ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన రవిచంద్రారెడ్డి (స్కైమాక్స్ రవి) రాజీనామా చేశారు. అంతేనా, వైసీపీ సొంత పత్రిక సాక్షిలో టీడీపీ ప్రకటన...

ఎక్కువ చదివినవి

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను డాక్టర్లు డిశ్చార్జి చేశారు. సైఫ్ కు...

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. జగన్ ను ఏకి పారేస్తున్న నెటిజన్లు..!

చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గత జగన్ పాలనకు తమ పాలనకు స్పష్టమైన తేడాను చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యక్తిగతంగా తిట్టడానికి పోకుండా.. తమ పనుల ద్వారానే జగన్...

‘సంక్రాంతికి వస్తున్నాం’తో బోణీ కొట్టా.. ఈ ఏడాదంతా బిజీనేః వీకే నరేశ్

2025 సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తో స్టార్ట్ కావడం సంతోషంగా ఉందని సీనియర్ నటుడు వీకే నరేశ్ అన్నారు. జనవరి 20న ఆయన పుట్టిన రోజు సందర్భంగా...

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. గురువారం అర్ధరాత్రి 2.30 సమయంలో ముంబైలోని బాంద్రా లో ఉన్న తన నివాసంలోకి ఓ వ్యక్తి...