హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె గెలుపుపై టీఆర్ఎస్ సంబరాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో అపశృతి జరిగింది. సంబరాల్లో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో కార్యాలయం పైకప్పు తగలబడింది.
దీంతో అక్కడ మంటలు వ్యాపించాయి. ఆ మంటలు, కొన్ని నిప్పురవ్వలు ఎండిన చెట్లపై పడటంతో అక్కడ కూడా మంటలు చెలరేగాయి. ఈక్రమంలో తెలంగాణ భవన్ లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగపోవడంతో నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
212094 165659Glad to be 1 of many visitants on this awesome web site : D. 84903
744368 111915Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 133987
229955 301096What a lovely weblog. I will certainly be back once more. Please maintain writing! 108182
812828 930193Intriguing, but not perfect. Are you going to write a lot more? 784592