Switch to English

జనసేన, బీజేపీకి బైబై చెప్పడం ఖాయమా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. – ఇదీ తెలంగాణ బీజేపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. తెలంగాణ బీజేపీ నేతలు జనసేన పట్ల అవలంభిస్తున్న వైఖరిని చూసిన తర్వాతే జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగానే తెలంగాణ బీజేపీ నాయకులపై పవన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగి పవన్ తో భేటీ అయి పరిస్థితి చక్కదిద్దింది. ఫలితంగా జనసేన శ్రేణులు బీజేపీకి అండగా నిలబడటంతోనే జీహెచ్ఎంసీలో దాదాపు 50 స్థానాలను కమలనాథులు సొంతం చేసుకున్నారు.

అయినప్పటికీ ఈ విషయంలో జనసేన పాత్రను చిన్నదిగా చేయడానికే తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా జనసేనాని తెలంగాణ బీజేపీ నేతలకు షాక్ ఇచ్చారు. గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, పీవీ కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. అంటే ఒకరకంగా తెలంగాణ బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నట్టేననే సంకేతాలిచ్చారు. అయితే, ఈ పంచాయతీ కేవలం తెలంగాణకే పరిమితం చేస్తారా.. లేక ఏపీలోనూ కమలనాథులను విడిచిపెడతారా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

జనసే రాజకీయ ఆరంగేట్రం జరిగి సరిగ్గా ఏడేళ్లు పూర్తయింది. ఈ ఏడేళ్లలో జనసేన సాధించింది ఏమిటి అంటే.. అంతా శూన్యమే కనిపిస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకున్న పార్టీలు లాభపడ్డాయి తప్ప.. జనసేనకు వారి వల్ల వీసమెత్తు లబ్ధి చేకూరలేదన్నది ఎవరూ కాదనలేని సత్యం. 2014లో బీజేపీ, టీడీపీకి జనసేన మద్దతుగా నిలవడంతోనే ఆ రెండు పార్టీలు ఏపీలో అధికారంలోకి వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేయడంతో అందరూ ఓటమి చవిచూశారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం పార్టీకి దూరంగా, అధికార పార్టీకి దగ్గరగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మరో ఐదేళ్లపాటు నడవాలంటే జాతీయ పార్టీ అండ అవసరమనే భావనతో పవన్ మళ్లీ బీజేపీతో జతకట్టారు. కానీ దీనివల్ల జనసేనకు నష్టం తప్ప లాభం కలగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అటకెక్కించడంతోపాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ అనుసరించిన వైఖరి ఆ పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. పైగా విశాఖ ఉక్కు ప్లాంటును ప్రైవేటీకరణ చేయడం ఖాయమంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారు స్పష్టంచేయడంతో ఏపీలో కమలనాథులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనపైనా పడింది. బీజేపీతో తెగదెంపులు చేసుకుని పోటీలో దిగి ఉంటే పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉండేది కాదని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీతో కలిసి వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, సాధ్యమైనంత త్వరగా ఆ పార్టీకి బైబై చెప్పడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కటే కారణం కాదని.. ఏపీ బీజేపీలో కొందరు అధికార వైసీపీతో లాలూచీ పడి డబుల్ గేమ్ ఆడుతుండటం కూడా మరో కారణమని అంటున్నారు. ఏపీలో బీజేపీ కేవలం నలుగురి చేతుల్లోనే ఉందని.. వారు పగలు వైసీపీపై విమర్శలు చేసి, సాయంత్రం వారితో టచ్ లో ఉంటున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అధికారపార్టీ పోరాటం జరపలేని పార్టీతో తాము పొత్తు పెట్టుకుని సాధించేది ఏముందని పలువురు జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీ రెండూ తమ వల్ల లబ్ధి పొందాయని.. ఆ పార్టీలతో పొత్తు వల్ల జనసేనకు ఎలాంటి లాభం చేకూరకపోగా, ఇప్పుడు నష్టమే ఎక్కువగా జరుగుతోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎవరితో ఎలాంటి పొత్తూ లేకుండా నేరుగా యుద్ధరంగంలోకి మనమే దిగుదామనే సంకేతాలను జనసేన అధినాయకత్వానికి పంపిస్తున్నారు. తెలంగాణలో పీవీ కుమార్తె వాణీదేవికి మద్దతిస్తామంటూ తెలంగాణ విభాగం చేసిన ప్రతిపాదనను గౌరవించిన జనసేనాని.. ఏపీ బీజేపీ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీతో కలిసి ఉండటం వల్ల ఒరిగేది ఏమీ లేదని.. పైగా లాభం కంటే నష్టమే ఎక్కువని పార్టీ నేతలు, శ్రేణులు కుండబద్దలు కొడుతున్న ప్రస్తుత తరుణంలో జనసేనాని నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. మరి పవన్.. ఈ పొత్తులకు బైబై చెప్పి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతారా లేదా అనేది తెలుసుకోవాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...