ఎన్నికల్లో మమతా బెనర్జీ ఎమోషనల్ కార్డు ఉపయోగిస్తున్నట్టు బెంగాల్ ప్రజలు తెలుసుకున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బీజేపీకి పట్టం కట్టేందుకు బెంగాల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆయన బెంగాల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మమతా బెనర్జీకి జరిగింది ప్రమాదమే కానీ.. కుట్ర కాదన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయడం కూడా అనవసరం అని అన్నారు. ప్రజాకోర్టులోనే అన్ని విషయాలూ బైటకు వస్తాయని అన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని.. ఆ వాతావరణాన్ని చెడగొట్టకూడదని అన్నారు. ఫలితాలు ఎలా ఉన్నా స్వీకరించాలన్నారు. బెంగాల్లో 200 పైగా సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు అవిశ్రాంతంగా పోరాడుతున్నారని గడ్కరీ అన్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రెండు జాతీయ ప్రాజెక్టులను రెండేళ్ల కాలంలోనే పూర్తి చేస్తామన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ – బీజేపీ మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. మమత ఏకంగా వీల్ చైర్ నుంచే ప్రచారం చేస్తున్నారు.
206985 972258Beneficial information. Fortunate me I discovered your internet internet site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 985512