Switch to English

నయా సోషల్‌ పోకడ: ప్రశ్నిస్తే ‘గ్యాంగ్‌ రేప్‌’ చేసేస్తాం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఏదన్నా విషయమ్మీద సెలబ్రిటీలు స్పందిస్తే, ‘గ్యాంగ్‌ రేప్‌ చేసేస్తాం..’ అంటూ నెటిజన్లు కొందరు విరుచుకుపడటం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. కొన్నాళ్ళ క్రితం హీరోయిన్‌ మీరా చోప్రా విషయంలో ఇదే జరిగింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. అదీ ఓ తెలుగు హీరో అభిమానుల నుంచి ఆమెకు ఆ స్థాయిలో బెదిరింపులు వచ్చాయి.

తెలుగునాట అనసూయ భరద్వాజ్‌ తదితర సెలబ్రిటీలకు ఈ తరహా ‘రేప్‌’ బెదిరింపులు సోషల్‌ మీడియా వేదికగా ఎక్కువైపోయాయి. పోలీసులకు ఆయా సెలబ్రిటీలు ఫిర్యాదులు చేయడం, కేసులు నమోదైనా.. ఆయా కేసుల్లో నిందితులకు సరైన శిక్షలుపడకపోవడం.. ఈ పైత్యం మరింత పెరిగిపోయింది. హీరోయిన్ల నుంచి ఇప్పుడు హీరోలు, ఇతర సెలబ్రిటీల కుమార్తెలకూ ఈ తరహా బెదిరింపులు ఎక్కువైపోవడం గమనార్హం.

ఇటీవల క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ కుమార్తెపై గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడతామంటూ కొందరు నెటిజన్లు రెచ్చిపోయారు. కేసు నమోదయ్యింది.. ఈ కేసులో ఓ మైనర్‌ బాలుడ్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

తాజాగా, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కుమారెను రేప్‌ చేస్తామంటూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. శ్రీలంక క్రికెటర్‌ మురళీధరన్‌ బయోపిక్‌లో విజయ్‌ సేతుపతి నటిస్తుండడమే ఇందుకు కారణం. వివాదం ముదిరి పాకాన పడింది. మురళీధరన్‌ స్వయంగా విజయ్‌ సేతుపతిని అభ్యర్థించాడు, సినిమా చేయొద్దని. దాంతో విజయ్‌ సేతుపతి ఆ సినిమా నుంచి తప్పుకున్నా, ఆయన కుమార్తెకు మాత్రం సోషల్‌ మీడియా వేదికగా లైంగిక వేధింపులు తప్పడంలేదు.

ఈ మధ్య ఓ కామెడీ ప్రోగ్రాంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ని అనుకరించారన్న అరోపణలతో, ఆ కామెడీ ప్రోగ్రాంకి హోస్ట్‌గా వ్యవహరించిన నాగబాబు కుమార్తె నిహారికపైనా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు వైసీపీ మద్దతుదారులు కొందరు చేశారు. సోషల్‌ మీడియా అంటే ఎలాంటి వెర్రి రాతలైనా రాసుకోవచ్చా.? నారా లోకేష్‌ సతీమణినీ, వైఎస్‌ జగన్‌ సోదరినీ.. ఇలా ఎవర్నీ వదలట్లేదు.

ఆయా పార్టీలు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయని అనలేం. ఆయా హీరోల అభిమానులూ, ఇలాంటివి ప్రోత్సహిస్తారని అనడం సబబు కాదు. పార్టీల ముసుగులోనో, ఆయా సెలబ్రిటీల అభిమానుల ముసుగులోనో ఈ తరహా ‘రేప్‌’ వార్నింగ్‌లు సోషల్‌ మీడియా వేదికగా ఇవ్వడం అత్యంత జుగుప్సాకరం. ఇలాంటి వాటిపై పోలీసులు చర్యలు తీసుకోవడం సంగతెలా వున్నా, ఇలాంటివాటిని ఆయా సోషల్‌ మీడియా సంస్థలు ‘సెన్సార్‌’ చేయడం మంచిదేమో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...