స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కొనసాగుతూ వస్తున్న పార్లమెంటు భవనం స్థానంలో కొత్త పార్లమెంటును నిర్మించాలనే నిర్ణయానికి మోడీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 861.90 కోట్ల రూపాయలతో భారత పార్లమెంట్ కొత్త భవనంను నిర్మించేందుకు బిడ్ సొంతం చేసుకుంది. పార్లమెంట్ భవనంను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు సిద్దం అవుతున్నారు. రాబోయే వందేళ్ల అవసరాల దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ ను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వాయి కాలుష్యం, శబ్ద కాలుష్యం వెలువడకుండా పార్లమెంటు నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇప్పటికే డిజైన్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పార్లమెంట్ ఉభయ సభల నిర్మాణంకు సంబంధించి అన్ని రకాల ప్లానింగ్స్ కు ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చాయి. లోక్ సభలో 888 మంది కూర్చునే వీలు కల్పిస్తున్నారు. రాజ్యసభలో 384 సీట్లు ఉండేలా డిజైన్ చేశారు. ప్రభుత్వం డిసెంబర్ లో ప్రారంభోత్సవంకు ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రపతి, ప్రధాని, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ల చేతుల మీదుగా డిసెంబర్ లో భూమి పూజను నిర్వహించబోతున్నారు. నిర్మానంను ప్రతిరోజు పర్యవేక్షించేందుకు గాను ఒక బృందంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2022 అక్టోబర్ వరకు పార్లమెంటు భవనంను పూర్తి చేయాలని కేంద్రం సూచించింది.
535902 58452I admire your piece of work, regards for all the intriguing posts . 928429