విజయవాడలో దశాబ్దాలుగా వేలాది కళాప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయంగా మారిన తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరు మార్పు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రికి ఎదురుగా విశాలమైన స్థలంలో ఉన్న ఈ ఆడిటోరియం ఎన్నో కార్యక్రమాలకు నిలయంగా ఉంది. 1953లో నగరానికి చెందిన డాక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి నారాయణ పంతులు ఈ స్థలాన్ని నగరపాలకసంస్థకు విరాళంగా ఇవ్వడంతో ఆడిటోరియం నిర్మాణం జరిగింది.
2015లో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆడిటోరియం అభివృద్ధికి 2కోట్లు మంజూరు చేయగా అభివృద్ధి పనులు పూర్తయ్యాక అప్పటి సీఎం చంద్రబాబు ఆడిటోరియంను ప్రారంభించారు. ఆడిటోరియం వెలుపల పచ్చదనం, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసి మరింత సుందరీకరించారు. వైసీపీ ప్రభుత్వం కూడా కోటితో అధునీకరించింది. ఇంతటి చరిత్ర కలిగిన ఆడిటోరియంకు ఎప్పుడూ ఉండే తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం అని కాకుండ కేవలం కళాక్షేత్రం అని ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్చి ప్రభుత్వం విమర్శలపాలైంది.
461621 145884But wanna comment that you have a quite good internet internet site , I really like the style and design it genuinely stands out. 537646
420403 595018woah i like yur internet site. It actually helped me with the data i wus looking for. thank you, will save. 123287
607464 314667IE still is the market chief and a large component to folks will miss your magnificent writing due to this problem. 873558