ఓ మైనార్టీ సోదరుడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో సందేశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందర్నీ ఈ వీడియో ఆలోచింపజేస్తోంది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు, మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేసుకోలేని పరిస్థితి. క్రిస్టియన్లు చర్చికి వెళ్ళలేరు.. హిందువులు దేవాలయలకు వెళ్ళలేరు. ఎందుకంటే లాక్డౌన్ నేపథ్యంలో, మతపరమైన కార్యక్రమాల పట్ల కరినతరమైన ఆంక్షలున్నాయి.
మంచిదే, మర్కజ్ అనుభవాల నేపథ్యంలో ఏ మతానికి చెందినవారైనా సరే, తమ తమ ప్రార్థనా స్థలాల వద్ద జనం గుమికూడే అవకాశం వుంటుంది గనుక.. వాటిని కొన్నాళ్ళ పాటు బంద్ చేయడమే మంచిదన్న అభిప్రాయంతో వున్నారు. కానీ, లిక్కర్ షాపుల్ని తెరవడంలో ఆంతర్యమేంటి.? ఇదే, పైన చెప్పుకున్న మైనార్టీ సోదరుడు సంధించిన ప్రశ్న కూడా. ‘మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేయకూడదా.? కరోనా వైరస్ వస్తుందా.? మరి, లిక్కర్ షాపుకి వెళితే కరోనా రాదా.? కరోనాకి బదులుగా కరీనా కపూర్ వస్తుందా.?’ అని ప్రశ్నించాడు ఆ మైనార్టీ సోదరుడు. అతనొక్కడి ఆవేదనే కాదు ఇది.
ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇదే ప్రశ్నిస్తున్నారు. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, ప్రజల అభిప్రాయాలతో ప్రభుత్వాలకి సంబంధం లేదు. ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాల్ని ప్రోత్సహిస్తున్నాయి ప్రభుత్వాలు నిస్సిగ్గుగా.
ఏమన్నా అంటే, ధర పెంచితే మద్యం తాగేవారి సంఖ్య తగ్గుతుందన్న చెత్త లాజిక్ ఒకటి ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ తెరపైకి తెస్తోంది. తొలి రోజు రికార్డు స్థాయి అమ్మకాలు.. రెండో రోజూ అదే పరిస్థితి. తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో లిక్కర్ కోసం జనం ఎగబడ్తున్న వైనం చూసి, ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. ఈ మాత్రందానికి నలభై రోజులకు పైగా జనం లాక్డౌన్ని ఎందుకు భరించినట్లు.? అలా భరించడం వల్ల ప్రజలకు ఒరిగిందేమిటి.?
354321 770247quite nice post, i in fact love this internet web site, keep on it 455920