అనారోగ్యంతో పిల్లల బాగోగులు చూసుకోలేక పోతున్నాను అనే బాధతో భార్గవి అనే గృహిణి తన పదేళ్ల కొడుకుకు ఉరి వేసి అతడు చనిపోయిన తర్వాత ఆమె కూడా ఉరి వేసుకుని మృతి చెందింది. ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన భర్త సతీష్ ఇంట్లో దృశ్యం చూసి కన్నీరు మున్నీరు అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు భార్గవి రాసిన సూసైడ్ లేఖను స్వాదీనం చేసుకున్నారు. ఆమె అనారోగ్య కారణం వల్లే మృతి చెందినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన సతీష్ మరియు భార్గవిలు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి 10 యేళ్ల బాలుడు మరియు ఏడాది వయసు ఉన్న పాప ఉన్నారు. వీరు హైదరాబాద్లోని హైదర్షకోట్లో ఉంటున్నారు. పాప పుట్టినప్పటి నుండి కూడా భార్గవి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. కొన్నాళ్ల క్రితం ఆపరేషన్ కూడా చేయించాడు. అయినా కూడా ఆరోగ్యం కుదుట పడలేదు. పాపను చూసుకునే వీలు లేకపోవడంతో డే కేర్ సెంటర్లో జాయిన్ చేశారు. ఇదే సమయంలో బాబుకు కూడా అన్ని చేసి పెట్టలేక పోతున్నాను అంటూ మానసికంగా సంఘర్షణకు గురి అయ్యేది. సాఫ్ట్వేర్ జాబ్ చేసే సతీష్ ఆఫీస్కు వెళ్లిన సమయంలో బాబుకు కళ్లకు గంతలు కట్టి ఉరి వేసి, ఆ తర్వాత ఆమె కూడా ఉరి వేసుకుని మృతి చెందింది.
924622 947251Simply wanna remark which you have a very nice internet web site , I enjoy the layout it actually stands out. 50748
649201 137341I saw a lot of web site but I believe this 1 contains something unique in it in it 985716
819685 735640Hey there. I want to to ask a bit somethingis this a wordpress web log as we are preparing to be transferring over to WP. Additionally did you make this template all by yourself? Several thanks. 217440