తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్బాబు, వైఎస్ జగన్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. అశోక్బాబు తరఫున ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చీఫ్ సెక్రెటరీ సహా పలువుర్ని ప్రతివాదులుగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో సీఆర్డీయే రద్దు బిల్లునీ తెచ్చింది. గవర్నర్ ఈ రెండు బిల్లులకూ ఆమోద ముద్ర కూడా వేశారు.
అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు, మూడు రాజధానుల ఎపిసోడ్పై ‘స్టేటస్ కో’ ఆదేశాలు కూడా జారీ చేసింది. దాన్ని, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కూడా. ఇక, అశోక్బాబు పిటిషన్ విషయానికొస్తే, శాసన మండలిలో పరిణామాల్ని సుదీర్ఘంగా తన పిటిషన్లో పేర్కొన్నారాయన. శాసన మండలి నిబంధనల ప్రకారం, బిల్లు పాస్ కాలేదనీ, శాసన మండలి ఛైర్మన్ సంతకం లేకుండా గవర్నర్ ఆ బిల్లుల్ని ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు అశోక్బాబు.
శాసన మండలిలో తొలుత పాస్ అయిన వెంటనే, ఈ బిల్లుల్ని శాసన మండలికి పంపగా, అక్కడ పెద్ద యాగీనే జరిగింది. సెలక్ట్ కమిటీకి బిల్లుల్ని పంపిస్తూ, మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా, రెండోసారి అదే బిల్లుని అసెంబ్లీలో పాస్ చేయించుకుంది. మరోపక్క, రెండోసారీ అసెంబ్లీలో బిల్లు పాస్ కాగా, శాసన మండలిలో యధాతథంగా గందరగోళం కొనసాగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ బిల్లులు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదని ప్రతిపక్షం టీడీపీ వాదిస్తూ వచ్చింది.
మరోపక్క, న్యాయ నిపుణులు మాత్రం, శాసన మండలి ఆమోదం ఈ బిల్లులకు అవసరం లేదనీ, శాసన మండలితో సంబంధం లేకుండా నిర్ణీత గడువు తర్వాత ఆయా బిల్లులు ఆమోదం పొందినట్లే అవుతుందన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. మరి, ఇప్పుడు అశోక్బాబు తరఫున జంధ్యాల రవిశంకర్ దాఖలు చేసిన పిటిషన్ ఏమవుతుంది.? రాష్ట్ర ప్రభుత్వం, ఈ పిటిషన్పై ఎలా స్పందిస్తుంది.? ఏమోగానీ, ఆగస్ట్ 16న విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి శంకుస్థాపన చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి వున్నట్లు తెలుస్తోంది. మరి, ఆలోగా.. ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఊరట దక్కుతుందా.? వేచి చూడాల్సిందే.
37463 12778I genuinely enjoyed reading this internet site, this really is fantastic weblog. 679817