Switch to English

3 క్యాపిటల్స్‌ని హైకోర్టులో సవాల్‌ చేసిన అశోక్‌బాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని హైకోర్టులో సవాల్‌ చేశారు. అశోక్‌బాబు తరఫున ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో చీఫ్‌ సెక్రెటరీ సహా పలువుర్ని ప్రతివాదులుగా చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో సీఆర్డీయే రద్దు బిల్లునీ తెచ్చింది. గవర్నర్‌ ఈ రెండు బిల్లులకూ ఆమోద ముద్ర కూడా వేశారు.

అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు, మూడు రాజధానుల ఎపిసోడ్‌పై ‘స్టేటస్‌ కో’ ఆదేశాలు కూడా జారీ చేసింది. దాన్ని, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది కూడా. ఇక, అశోక్‌బాబు పిటిషన్‌ విషయానికొస్తే, శాసన మండలిలో పరిణామాల్ని సుదీర్ఘంగా తన పిటిషన్‌లో పేర్కొన్నారాయన. శాసన మండలి నిబంధనల ప్రకారం, బిల్లు పాస్‌ కాలేదనీ, శాసన మండలి ఛైర్మన్‌ సంతకం లేకుండా గవర్నర్‌ ఆ బిల్లుల్ని ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు అశోక్‌బాబు.

శాసన మండలిలో తొలుత పాస్‌ అయిన వెంటనే, ఈ బిల్లుల్ని శాసన మండలికి పంపగా, అక్కడ పెద్ద యాగీనే జరిగింది. సెలక్ట్‌ కమిటీకి బిల్లుల్ని పంపిస్తూ, మండలి ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా, రెండోసారి అదే బిల్లుని అసెంబ్లీలో పాస్‌ చేయించుకుంది. మరోపక్క, రెండోసారీ అసెంబ్లీలో బిల్లు పాస్‌ కాగా, శాసన మండలిలో యధాతథంగా గందరగోళం కొనసాగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ బిల్లులు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదని ప్రతిపక్షం టీడీపీ వాదిస్తూ వచ్చింది.

మరోపక్క, న్యాయ నిపుణులు మాత్రం, శాసన మండలి ఆమోదం ఈ బిల్లులకు అవసరం లేదనీ, శాసన మండలితో సంబంధం లేకుండా నిర్ణీత గడువు తర్వాత ఆయా బిల్లులు ఆమోదం పొందినట్లే అవుతుందన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. మరి, ఇప్పుడు అశోక్‌బాబు తరఫున జంధ్యాల రవిశంకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ఏమవుతుంది.? రాష్ట్ర ప్రభుత్వం, ఈ పిటిషన్‌పై ఎలా స్పందిస్తుంది.? ఏమోగానీ, ఆగస్ట్‌ 16న విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌కి శంకుస్థాపన చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి వున్నట్లు తెలుస్తోంది. మరి, ఆలోగా.. ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఊరట దక్కుతుందా.? వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...