ఎప్పుడైతే .. ప్రభాస్ బాహుబలి సినిమా విడుదలైందో అప్పటి నుండి సౌత్ హీరోల అంచనాలు మారిపోయాయి. అంతకు ముందు సౌత్ లో ఏ భాషలో సినిమా తీసిన ఉదాహరణకు తమిళంలో సినిమా తీస్తే దాన్ని .. తెలుగు, కన్నడ, మలయాళంలో మాత్రమే డబ్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు .. కానీ బాహుబలి ఇంపాక్ట్ తో ఇప్పుడు సోత్ లో వస్తున్న సినిమాలకు నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు సౌత్ కథలు బాలీవుడ్ కి వెళ్ళేవి .. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా రూపాంతరం చెందుతూ .. డైరెక్ట్ గా అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల అవుతున్నాయి.
ఇక మన తెలుగు స్టార్ హీరోల ఫోకస్ ఇప్పుడు హిందీ మార్కెట్ పై పడింది. ఈ విషయంలో బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోయాడు. అందుకే నెక్స్ట్ సినిమా సాహూ ను కూడా పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పుడు ప్రభాస్ దారిలోనే ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ తో సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీరి దారిలోనే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు.
Also Read: మహేష్ కోసం మిల్కి భామ కాదు .. జిగేలు రాణి ?
తాజాగా ఈ లిస్ట్ లో చేరుతున్నాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు !! ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తున్న మహేష్ తన నెక్స్ట్ సినిమా కోసం భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కె జి ఎఫ్ లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించి అందరికి షాక్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చర్చలు కూడా జరిపాడు.
ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు. అంటే మహేష్ నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాగా ఉంటుందని సమాచారం. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కెజిఎఫ్ 2 తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తీ కాగానే మహేష్ సినిమా చేస్తాడట. ఇక ఇప్పటికే మహేష్ అంటే ఒక్క తెలుగులోనే కాదు ఇటు సౌత్ లో అటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది .. కాబట్టి మహేష్ పాన్ ఇండియా సినిమాతో మరో మెట్టు ఎక్కే అవకాశాలు ఎక్కువే !!
