ప్రస్తుత ప్రపంచం సాంకేతికంగా ముందుకు దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎనలేని అభివృద్ది కనిపిస్తోంది. గుండె తీసి కొత్త గుండె పెట్టేస్తున్నారు. సృష్టికే ప్రతిసృష్టి చేస్తున్నారు. చంద్రుడిని చుట్టి వచ్చేయడమే కాదు.. అంతరిక్షంలోకి సైతం అవలీలగా వెళ్లి వచ్చేస్తున్నారు. మన కంటికి కనిపించని నింగిని జయించిన మానవుడు.. అందరికీ కనిపించే నేలను, నీటిని మాత్రం జయించలేకపోతున్నాడు. భూకంపాలను నిరోధించడంలోనూ, వరదల వంటి విపత్తులను నియంత్రించలేకపోవడంలోనూ అంతగా విజయం సాధించలేకపోతున్నాడు.
ప్రకృతి విపత్తుల ముందు మానవుడి శక్తి తక్కువే అయినా.. చిన్న చిన్న విషయాల్లో కూడా అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. పాపికొండల విహారయాత్రకు వెళ్లిన లాంచీ మునిగిపోతే దానిని గుర్తించడానికే రెండు రోజుల సమయం పట్టింది. దాదాపు 300 అడుగుల లోతులో ఉన్న ఆ లాంచీని పైకి తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక బోరు బావిలో ఏ చిన్నారైనా పొరపాటున పడిపోతే వారు ప్రాణాలతో పైకి వస్తే అదృష్టంగానే భావించాలి.
Also Read: గోదావరిలో బోటు మునక: ఈ గులాబీ రాజకీయమేంటి.?
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. ఇలాంటి విషయాల్లో మాత్రం ఎలాంటి పురోగతి ఉండటంలేదు. ఆ మధ్యన మలేసియాకు చెందిన విమానం సముద్రంలో కూలిపోయింది. దాని జాడ కనుక్కోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. పలు దేశాలు సమిష్టిగా గాలించినా ప్రయోజనం కనిపించలేదు. ఇక మన వైమానిక దళానికి చెందిన విమానం అండమాన్ వెళుతూ బంగాళాఖాతంలో కూలిపోయింది. అది ఎక్కడ పడిందో ఇప్పటికీ తెలియదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదంతో రెండతస్తుల లాంచీ మునిగిపోయింది.
ఈ ఘటనలో దాదాపు 50 మంది జలసమాధి అయ్యారు. వారిలో కొంతమంది మృతదేహాలు ఇంకా దొరకలేదు. లాంచీ మునిగిపోయిన ప్రదేశం కచ్చితంగా తెలిసినా, అది ఎంతో లోతులో ఉందో తెలుసుకోవడానికే రెండు రోజులు పట్టిందంటే టెక్నాలజీపరంగా మనం ఎంత వెనక ఉన్నామో అర్థమవుతోంది. ఇక ఆ లాంచీని పైకి తీసుకురావడం ఎలాగో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ది చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉండటం నిజంగా శోచనీయమే.
ప్రమాదాల్ని మనం ఊహించలేం. కానీ వాటిని నివారించడం మన చేతుల్లో పనే కదా? ప్రభుత్వం, అధికార యంత్రాంగం పక్కాగా పని చేసి ప్రజల ప్రాణాల పట్ల సరైన శ్రద్ధ వహిస్తే కచ్చులూరు వంటి ఘటనలు జరగవు కదా? మునిగిపోతే దేవుడే దిక్కు అని అనుకోకుండా మునిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటే అధికారులే దేవుళ్లు అవుతారు. ఘటన జరిగిన తర్వాత తప్పు మీదంటే మీది అని ఒకరిపై మరొకరు నెపం వేసుకోకుండా భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అభిలషిస్తున్నారు.
151905 588416Soon after study several with the blog articles for your internet website now, and i also genuinely such as your strategy for blogging. I bookmarked it to my bookmark internet web site list and are checking back soon. Pls take a appear at my web page in addition and tell me what you believe. 396701
216026 991347Its difficult to get knowledgeable individuals with this subject, but the truth is could be seen as do you know what you are referring to! Thanks 228157