పెద్దపల్లి న్యాయవాదుల జంట హత్య ఇంకా మర్చిపోకముందే మరో హైకోర్టు లాయర్ పై హత్యోదంతం కలకలం రేపుతోంది. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై యశ్వంత్ పూర్ వద్ద జనగామ జిల్లాలో జరిగిందీ ఘటన. హైకోర్టు లాయర్ దుర్గాప్రసాద్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఏకంగా 500 మీటర్ల దూరం కారును ఈడ్చుకెళ్లింది. లాయర్ మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.
వెంటనే స్థానికులు అప్రమత్తమై లారీ డ్రైవర్ ను నిలదీయగా.. బ్రేకులు ఫెయిల్ అయినట్టు చెప్తున్నాడు. అయితే.. డ్రైవర్ మాటలకు జరిగిన సంఘటనకు పొంతన లేదని అంటున్నారు. కారును చాలా దూరం నుంచి వెంబడించి మరీ ఢీకొట్టినట్టు లాయర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ భూవివాదం కేసు వాదించేందుకు హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తున్నారు లాయర్. ఈ సమయంలో లారీ వెనుక నుంచి కారును ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
472732 295557This web-site is in fact a walk-through rather than the info you desired concerning this and didnt know who to inquire about. Glimpse here, and you will completely discover it. 800392
518711 279973Hi, you used to write outstanding posts, but the last several posts have been kinda boring I miss your wonderful posts. Past few posts are just slightly bit out of track! 307709