న్యాయవాద దంపతుల కిరాతక హత్యపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా తీసుకుంటామని పేర్కొంది. వెంటనే ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దిష్ట కాలపరిమితితో ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచించింది. అనంతరం కేసు విచారణను మార్చి ఒకటో తేదీకి వాయిదా వేసింది.
హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, వెంకట నాగమణిలను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద దుండగులు కిరాతకంగా హత్య చేశారు. కారులో హైదరాబాద్ వస్తున్న దంపతులను అటకాయించి అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి పారిపోయారు. ఈ క్రమంలో కొనఊపిరితో ఉన్న వామనరావు.. తమపై దాడి చేసింది మంథని టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ అని చెప్పారు. అనంతరం 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. గ్రామంలో స్థానికంగా ఉన్న వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
549596 33418You ought to join in a contest first with the greatest blogs on the web. I will recommend this internet website! 51665
910953 422162I want looking at and I believe this internet site got some truly helpful stuff on it! . 10418
204969 368215Thanks for all your efforts that you have put in this. very interesting info . 721486