తెలంగాణలోని పెద్దపల్లిలో దారుణం జరిగింది. హైకోర్టు న్యాయవాది దంపతులను నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురయ్యారు. అందరూ చూస్తూండగా నిందితులు అత్యంత కర్కశంగా కత్తులతో హతమార్చడం తీవ్ర కలకలం రేపుతోంది. హైకోర్టులో న్యాయవాది గట్టు వామన్ రావు, ఆయన భార్య నాగమణి మంధని కోర్టులో పని ముగించుకుని హైదరాబాద్ వెళ్తూండగా ఈ దారుణం జరగింది. రామగిరి మండలం కల్వచర్ల పెట్రోల్ బంకు ఎదురుగా వీరి వాహనాన్ని అడ్డగించి దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. బాధితులను 108 ఆంబులెన్స్ లో తరలిస్తూండగా మర్గమధ్యలోనే వీరు మృతి చెందారు.
వామన్ రావుది మంధని మండలం గంజెపడుగు. శీలం రంగయ్య లాకప్ డెత్ కేసును వామనరావు వాదించారు. హత్యకు గురై చావుబతుకుల మధ్య ఉన్న వామన్ రావు మంధని మండలాధ్యక్షుడు కుంట శ్రీనివాస్ పేరు ప్రస్తావించారు. భూ ఆక్రమణలపై సోషల్ మీడియాలో స్పందించారు. కుంట శ్రీనివాస్, కుమార్ పై తమకు అనుమానం ఉందని వామనరావు సోదరుడు ఇంద్రశేఖర్ అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం విస్తృత గాలింపు చేపట్టారు. నిందితులెంతటి వారైనా వదలమని రామగుండం సీపీ సత్యనారాయణ అన్నారు.
703698 551336This internet page may possibly be a walk-through like the data you wanted concerning this and didnt know who need to have to. Glimpse here, and you will definitely discover it. 31032
675809 638560Take a peek at the following ideas what follows discover perfect approach to follow such a mainly because you structure your small business this afternoon. earn funds 298857