చెత్త పన్ను కట్టలేదని ఏకంగా దుకాణాల ముందే చెత్త వేసిన ఘటన కర్నూలు నగరంలో జరిగింది. నగరపాలక సిబ్బంది చేసిన పని అందరినీ విస్తుపోయేలా చేసింది. చెత్త పన్ను కట్టలేదని ఏకంగా దుకాణాల ముందే చెత్త వేసి వెళ్లారు సిబ్బంది.
కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్ నుంచి అనంత కాంప్లెక్స్ వరకూ చెత్త పన్ను వసూలు చేసే క్రమంలో వార్డు సచివాలయ పారిశుద్ధ్య సిబ్బంది వెళ్లారు. అన్ని పన్నులు చెల్లిస్తున్నాం.. మళ్లీ చెత్త పన్ను ఎందుకు కట్టాలి అని దుకాణదారులు ప్రశ్నించారు.
దీంతో సిబ్బంది సహనం కోల్పోయి చెత్తను తీసుకొచ్చి వారి దుకాణాల ముందు వేసి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా చెత్తపై పన్ను వేసింది కాకుండా.. దుకాణాల ముందు చెత్త వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. చెత్త పన్ను కట్టకపోతే పరిణామాలు ఇలానే ఉంటాయని నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది చెప్పినట్టు తెలుస్తోంది.
162459 917697I was trying to find this. Really refreshing take on the details. Thanks a good deal. 987393